www.ysrcongress.net :

21న వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ దినోత్సవం

Written By SR on Sunday, May 19, 2013 | 5/19/2013

 వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 21న లక్డీకాపుల్ వద్ద గల వాసవీ సేవా కేంద్రంలో ఉదయం పది గంటలకు జరుగుతుందని రాష్ట్ర కన్వీనర్ ఓబుళపతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు విశ్వేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.

సీఎంకు సబిత, ధర్మాన రాజీనామాలు?

సీఎం కిరణ్ తో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి సమావేశం ముగిసింది. ధర్మాన, సబిత తమ పదవులకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. సీఎంకు తమ రాజీనామా లేఖలు ఇచ్చినట్టు సమాచారం. సమావేశం ముగిసిన తర్వాత మంత్రులిద్దరూ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. సీఎం రేపు గవర్నర్ ను కలిసే అవకాశముంది.

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=601948&Categoryid=14&subcatid=0

ప్రధాని, సిబిఐ డైరెక్టర్‌కు వైఎస్‌ భారతి లేఖ

ప్రధాని మన్మోహన్‌, సిబిఐ డైరెక్టర్‌కు వైఎస్‌ భారతి రెడ్డి లేఖ రాశారు. సిబిఐ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ప్రధానిని భారతి రెడ్డి కోరారు. మే 27, 2012 నుంచి తన భర్త జగన్‌ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారని, కీలక ఉప ఎన్నికల సమయంలో జగన్‌ను అరెస్ట్‌ చేశారని గుర్తు చేశారు. ఒక భార్యగా, ఒక తల్లిగా మీకు ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు.

అక్టోబర్‌ 2012లో సుప్రీంకోర్టు విచారణలో సిబిఐ ఒక మాట చెప్పిందని, విచారణ పూర్తి చేయడానికి మూడు నెలల గడువు ఇవ్వాలని కోరింది. 8నెలల తర్వాత సుప్రీంకోర్టు సాక్షిగా సిబిఐ మాట మార్చిందని తెలిపారు. మరో 4 నెలలు గడువు కావాలంటూ కోర్టుకు సిబిఐ తెలిపిందన్నారు. ఉత్తర్వులు వెలువడిన మరుక్షణమే కోర్టును అగౌరవపరిచేలా సిబిఐ లాయర్‌ మాట్లాడారన్నారు. దర్యాప్తుకు గడువు లేదంటూ సిబిఐ లాయర్‌ సంకేతాలిచ్చారని అన్నారు. మరింత గడువు కోసం కొత్త కారణాలు చూపిస్తోందన్నారు. సజావుగా దర్యాప్తు చేయకూడదన్న దురుద్దేశం ఇందులో కనిపిస్తోందన్నారు.

సిబిఐ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్టు, సరిగా విధులు నిర్వర్తిస్తున్నట్టు ఏ కోశాన కనిపించట్లేదన్నారు. సిబిఐ దర్యాప్తు కాలంలో వైఎస్‌ జగన్‌ ఎలాంటి పదవిలో లేరన్నారు. 2004- 2009 మధ్య కాలంలో జగన్‌ ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదన్నారు. 2001నుంచి బెంగళూరులోనే జగన్‌ నివాసమున్నారని తెలిపారు. నిబద్దత, అంకితభావంతో జగన్‌ వ్యాపారం నిర్వహించారన్నారు. డా.వైఎస్సార్‌ మరణించిన 15నెలల తర్వాత ఆరోపణలు మొదలయ్యాయని తెలిపారు. జగన్‌ కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన నెల రోజుల తర్వాత ఎమ్మెల్యే శంకర్రావు లేఖ రాశారని, ప్రతిఫలంగా శంకర్రావును రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రిగా తీసుకున్నారని అన్నారు. ఆ తర్వాత ఇదే కేసులో తెలుగుదేశం పార్టీ కూడా జత కలిసిందన్నారు. హైకోర్టు ఆదేశాలకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమాధానం చెప్పలేదన్నారు. ప్రభుత్వ వైఖరితో హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిందని తెలిపారు.

రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా వైఎస్‌ఆర్‌ నిర్ణయాలు తీసుకున్నారని, వాటిని సమర్థించుకునేందుకు ఆయన ఈనాడు మనమధ్య లేరన్నారు. నాడు నిర్ణయాల్లో భాగస్వాములైన మంత్రులంతా.. నేడు నోరు మెదపట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కేసులు ఎదుర్కొంటున్న మంత్రులందరికి ప్రభుత్వమే న్యాయ సాయం చేస్తోందన్నారు. 26 జీవోలు నిబంధనల ప్రకారమే జారీ అంటూ మంత్రులు అఫిడవిట్‌ దాఖలు చేశారని, నాటి ప్రభుత్వంలో ఎలాంటి భాగస్వామి కాని జగన్‌ ఎలా బాధ్యుడవుతారని ప్రశ్నించారు. ఉద్దేశ పూర్వకంగానే సిబిఐ జెడి దర్యాప్తును సాగదీస్తున్నారని ఆరోపించారు. కొన్ని అంశాలను ఎంపిక చేసుకుని మరీ లీకులిస్తున్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌ను, ఆయన పార్టీని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారు. కొందరు మీడియా ప్రతినిధులకు సిబిఐ జెడి వందలాది కాల్స్‌ చేశారని తెలిపారు.

ప్రారంభించిన ఐదేళ్లలో సాక్షి పత్రిక దేశంలోనే ఏడో స్థానానికి చేరిందని వెల్లడించారు. కోటి 43 లక్షల రీడర్‌షిప్‌ సాక్షి పత్రిక సొంతమన్నారు. ఇంత ఘనచరిత్ర ఉన్న సాక్షి రాత్రికి రాత్రే డమ్మీ కంపెనీలా మారుతుందా? అని ప్రశ్నించారు. షేర్‌హోల్డర్ల సంపద పెంచడమే కాకుండా 40వేల కుటుంబాలకు జగన్‌ ఉపాధి చూపారన్నారు. ఈనాడు పత్రికలా మేం వ్యవహరించలేదన్నారు. 1800 కోట్ల నష్టాల్లో ఉన్న ఈనాడు రూ.100 షేరును రూ.5.26లక్షలకు విక్రయించిందని గుర్తు చేశారు.

Maro Praja Prasthanam: Sharmila's speech in Nallajerla, WGDT

YS Bharathi letter to Manmohan Singh

భారీగా వైఎస్ఆర్ సిపిలో చేరిక

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రతిరోజూ ఈ చేరిక కొనసాగుతూనే ఉంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో 200 మంది యువకులు వైఎస్ఆర్‌ సీపీలో చేరారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు జంపన్నప్రతాప్, వెంకట్రావ్ సమక్షంలో 100 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. సికింద్రాబాద్ వైఎస్ఆర్‌సీపీ నేత ఆదం విజయ్ సమక్షంలో 100 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. కూకట్ పల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వడ్డేపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాల నుంచి 200 మంది పార్టీలో చేరారు.

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం గాంధీనగర్ లో ఆ పార్టీ నాయకురాలు షర్మిల సమక్షంలో 300 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు జన్నారెడ్డి మహేందర్ రెడ్డి, కర్ణావతు రాధా వెంకన్ననాయక్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు.

ఖమ్మం జిల్లా భద్రాచల నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ తెల్లం వెంకట్రావ్ సమక్షంలో మెల్లిమి హర్షవర్దన్ సహా 400 మంది కార్యకర్తలు వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారంతా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం సింగర్‌పల్లిలో గిద్దలూరు సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి 500 మంది వైఎస్ఆర్‌సీపీలో చేరారు.

Weavers problems to attention of the Assembly : YS Vijayamma

Special edition on 'Raitu baguntene rajyam bagundei

ఆత్మహత్యలు వద్దు-మంచిరోజులు వస్తాయి

కరీంనగర్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మాదిరిగా రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విమర్శించారు. సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజకీయం చేయడానికి తాను ఇక్కడకు రాలేదని చెప్పారు. నేతన్నలకు ధైర్యం చెప్పడానికి వచ్చానన్నారు. వైఎస్ ఐదేళ్లపాలనలో ప్రతి ఒక్కరికీ మేలు జరిగిందని గుర్తు చేశారు. వైఎస్ హయాంలో ఆహార, ఉద్యోగ, పెన్షన్, ఆవాస్ భద్రత ఉండేదని వివరించారు. ఇప్పుడు ఆ మేలు జరగడం లేదని తెలిపారు. 

బాబు హయాంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే, ఈ ప్రభుత్వం 4 సార్లు పెంచిందన్నారు. వైఎస్ హయాంలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు, పన్నులు పెంచలేదని గుర్తు చేశారు. నేతన్నలను ప్రత్యేక పథకాలతో వైఎస్ ఆదుకున్నారని చెప్పారు. వైఎస్ ఏర్పాటు చేసిన చేనేత టెక్స్ టైల్ పార్క్ ఇప్పుడు నిరుపయోగంగా మారిందన్నారు. ప్రతి మనిషి గుండె చప్పుడు తెలిసిన వ్యక్తి వైఎస్ఆర్ అని చెప్పారు. ఎవరు ఏది కావాలన్నా అడగక ముందే నెరవేర్చారని పేర్కొన్నారు. ఆత్మహత్యలు ఎవరూ చేసుకోవద్దని, మంచిరోజులు వస్తాయని చేనేత కార్మికులకు ధైర్యం చెప్పారు. వైఎస్ సువర్ణయుగాన్ని జగన్ బాబు తీసుకొస్తారన్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు ధైర్యంగా ఉండాలన్నారు. 312 కోట్ల రూపాయల రుణ మాఫీ చేయాలని బడ్జెట్ లో వైఎస్ పెట్టారని, దానిని కిరణ్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల సమస్యలను శాసనభలో మాట్లాడతానని చెప్పారు.

YS Vijayamma condolence to narayana family in Sirisilla

ప్రభాకర్ కుటుంబానికి విజయమ్మ పరామర్శ!

 సిరిసిల్లాలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన బాజంగి ప్రభాకర్ కుటుంబాన్ని వైఎస్ విజయమ్మ ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు. విద్యుత్ బిల్లు 59వేల రూపాయలు రావడంతో నేతన్న ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడిన నేతన్నల కుటుంబాలను పరామర్శించేందుకు విజయమ్మ కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు చేరుకున్నారు. సిరిసిల్లలో నేతన్నలు, కట్ల నారాయణ, బాజంగి ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించి, అధైర్య పడకూడదని వైఎస్ విజయమ్మ ధైర్యం చెప్పారు

నారాయణ కుటుంబానికి విజయమ్మ పరామర్శ!

సిరిసిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన నేతన్న కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పరామర్శించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయమ్మ సిరిసిల్లా చేరుకున్నారు. అప్పుల బాధతో మూడు రోజుల క్రికతం ఆత్మహత్య చేసుకున్న కట్ల నారాయణ కుటుంబాన్ని విజయమ్మ పరామర్శించారు. నారాయణ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని విజయమ్మ భరోసానిచ్చారు.

నోరు పారేసుకునే పిట్టల దొరలను చంద్రబాబు అదుపుచేయాలి

తెలుగుదేశం నేతలు వర్ల రామయ్య, రేవంత్ రెడ్డిలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత డాక్టర్ నల్లా సూర్యప్రకాశ్‌ మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నోరు పారేసుకునే పిట్టల దొరలను చంద్రబాబు అదుపుచేయాలి అని హెచ్చరించారు. వర్ల రామయ్య అడ్డుగోలుగా మాట్లాడుతూ ఇంటిపేరు సార్థకం చేసుకుంటున్నారని అన్నారు. వైఎస్ఆర్‌సీపీవి కాకిపలుకులంటూ రేవంత్‌రెడ్డి గాడిదలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 

50 ప్రభుత్వ రంగ సంస్థల్ని పప్పు బెల్లంలా తన వారికి అమ్ముకుంది చంద్రబాబేనని ఆయన అన్నారు. పరిటాల హత్యకు చంద్రబాబే కారణం కావచ్చు కదా అనే అనుమానాలను సూర్యప్రకాశ్ వ్యక్తం చేశారు. పాదయాత్ర ద్వారా చంద్రబాబుకు కాళ్ల నొప్పులు తప్ప మిగిలిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిలో వెన్నుపోటు దారుడు, పన్నుపోటు దారుడు చంద్రబాబునని విరుచుకుపడ్డారు. ఇక జీవితంలో ఆయనను ప్రజలు విస్మరించలేరని.. జగన్ కడిగిన ముత్యంలా బయటకు రావడం ఖాయమని నల్లా సూర్యప్రకాశ్‌ అన్నారు. 

సిరిసిల్లా బయలుదేరిన విజయమ్మ!

నేతన్నల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు బయలుదేరారు. అప్పలు బాధను తట్టుకోలేక ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నల కుటుంబాలను విజయమ్మ పరామర్శించనున్నారు. 

నాయకులేనా ఇలా మాట్లాడుతున్నది?!

చంద్రబాబుగారి వయసు 63 యేళ్లు. ఏ వయసు వారు ఆ వయసుకు తగిన మాటలు మాట్లాడాలని పెద్దలు అంటారు. గొప్పవారు పెద్దవారికైనా, చిన్నవారికైనా గౌరవం ఇవ్వాలి. ఈ వయసులో పోకిరీ పిల్లకాయలు జోకులు వేసుకొన్నట్లు, వెకిలిమాటలతో, వెక్కిరింతలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం, ప్రజల మధ్య రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం మంచిది కాదు కదా. 

ఆయనగారు ఆలోచించాలి. నిండుసభలలో వైఎస్సార్ కాంగ్రెస్‌ను జగన్ కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, జైలు కాంగ్రెస్ అని హేళనగా, కించపరిచినట్లు మాట్లాడటం సబబేనా? మిమ్ములను, మీ పార్టీని ఎన్టీయార్ తెలుగుదేశం, లక్ష్మీపార్వతి తెలుగుదేశం, మామకు నామాలు పెట్టిన తెలుగుదేశం, నారా వారి తెలుగుదేశం, లోకేశ్ తెలుగుదేశం, బాలకృష్ణ తెలుగుదేశం, కాంగ్రెస్ తెలుగుదేశం అని అంటే మీకు ఎలా ఉంటుంది? కాంగ్రెస్‌వాళ్లను తరిమి తరిమి కొట్టండి, గొడ్డళ్లతో నరకండి అని, ఈ సీఎం ఒక దద్దమ్మ, మంత్రిగాని ముఖ్యమంత్రి, సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి, దుర్మార్గుడు ఇలా ఎన్నో అన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఎం.ఐ.ఎం. నేతను అరెస్ట్ చేశారు. మీ ప్రసంగాల వల్ల మతఘర్షణల కంటే కూడా ఎక్కువ ఘోరాలు జరిగిపోవా! దీనిపై ఎవరూ మాట్లాడరు. ఎందుకు... మనవాడే గదా అని మిన్నకుండిపోయారా?

ప్రజలు గొర్రెల్లా కాంగ్రెస్‌కు ఓట్లువేసి గెలిపించారని, ఇప్పుడు ఆ పాపం అనుభవిస్తున్నారని అవమానించి ప్రజలను గొర్రెల కింద జమకట్టారు. మీ దృష్టిలో ప్రజలు గొర్రెలు. మీ పార్టీవారు మేధావులైన బర్రెలు. ఇంతింతై వటుడింతై అన్నట్లు మీరు గొప్పవారు అయ్యారు. మంచిదే. ప్రజలకు చెప్పి మెప్పించండి. ఓట్లు వేయించుకోండి. మీకు కుడి ఎడమల దన్నుగా ఉన్నవారు ఒక్కొక్కరే మిమ్ముల్ని చీకొట్టి ఎందుకు పోతున్నారు? మీ నోటి దురుసు వల్లనే కదా! మీరు జగన్ దగ్గర వేయి లారీల నోట్ల కట్టలు ఉన్నాయని అన్నారు. అవి తెచ్చి ప్రజలకు పంచి పెడతానన్నారు. ఆ వెయ్యి లారీల నోట్లు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు కదా. లారీలు తీసుకుని పోయి తెచ్చి పంచండి.

మీ ఆదేశంతో మీ పార్టీనేతలు ఒకరు ‘జగన్ ఇక జీవితమంతా జైలే’ అన్నారు. అతడు తానే జడ్జి అయి తీర్పు చెప్పాడు. ఇంకొకాయన జగన్ లక్షల కోట్లు దోచుకున్నాడు అన్నారు. ఇంకొకాయన షర్మిల, ఆమె భర్త వేలకోట్లు దోచుకున్నారని అన్నారు. ఇది ఎట్లా ఉందంటే, బొంకరా, బొంకరా పుల్లన్నా అంటే చిత్తూరి మిరియాలు గుమ్మడి కాయలంత ఉండాయని అన్నట్లు. తాను దొంగ అయితే, పొరుగును నమ్మరట. చెడుకాలం దాపురించినపుడు కనరు, వినరు, ఊర్కొనరు అని పెద్దలు అన్నారు. చంద్రబాబుగారు మీరు కాంగ్రెస్‌లో ఉన్నారు. మంత్రి పదవి పొందారు. 

కానీ తిన్నింటికే వాసాలు లెక్కించారు. చాకులాంటి కుర్రాడని ఎన్టీయార్ పిల్లనిచ్చి ఘనమైన కానుకలతో పెళ్లిచేశారు. పిల్లనిచ్చిన మామ కూడా తండ్రి లాంటివారే. ఆనాడు ప్రజలు దేవుడుగా భావించి, ఎన్టీఆర్‌కు పాలనా పగ్గాలు ఇచ్చారు. అలాంటి తండ్రి లాంటి మామగారికి కోడిగుడ్లు, టమోటాలు, చెప్పులతో మర్యాదలు చేసి, ప్రభుత్వ లాంఛనాలతో స్వర్గానికి పంపారు. అందుకే మీరు రోజూ రామా రామా తారక రామా అని పూలదండలతో ప్రజల మెప్పుకోసం, ఓట్ల కోసం పూజిస్తున్నారు. మా ఊరిలో ఒకాయన చెప్తుండేవాడు నమ్మినవారిని మోసం చేయడం చాలా సులభం, నమ్మనివారిని ఏమీ చేయలేమని. ముందున్నది మీ అందరికీ మొసళ్ల పండగ.

- వి.గోవిందరెడ్డి, బెంగళూరు


 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. 
e-mail: ysjagankosam@gmail.com

కాంగ్రెస్ పెద్దల సూచన మేరకు కొత్త డ్రామా

- కాంగ్రెస్ పెద్దల సూచన మేరకు కొత్త డ్రామాకు తెరలేపారు
- ఆరోపణలున్న మంత్రుల వ్యవహారంలో ఏడాదిగా మౌనం పాటించారు
- ఢిల్లీ వెళ్లివచ్చాకే అకస్మాత్తుగా గొంతు విప్పడం అనుమానాలకు తావిస్తోంది 
- లోకకల్యాణం కోసం పాటుపడుతున్నానని బాబు చెప్పుకోవడం సిగ్గుచేటు
- చీకటి ఒప్పందాలతో.. కాంగ్రెస్‌కు ఆపన్నహస్తం అందిస్తున్నారు 

సాక్షి, హైదరాబాద్: వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల సూచన మేరకు కొత్త డ్రామాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ఇటీవలి కాలంలో బాబు రెండు పర్యాయాలు ఢిల్లీ పర్యటన చేసిన తరువాతే.. వివాదాస్పద 26 జీవోలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల విషయంలో కొత్త పంథాలో ముందుకెళుతున్నారని ఆయన చెప్పారు. మంత్రి ధర్మానపై చార్జిషీట్ వేసి ఏడాది కావొస్తున్నదని, ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు ఢిల్లీ వెళ్లిరాగానే అకస్మాత్తుగా గవర్నర్, రాష్ట్రపతిని కలవాలనే ఆలోచన తట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. శ్రీకాంత్‌రెడ్డి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతున్నా, సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నా, ప్రజలపై పెనుభారం మోపుతున్నా ఏనాడూ స్పందించని చంద్రబాబు.. కుట్రలు, కుతంత్రాలే ఎజెండాగా ముందుకెళుతున్నారని ధ్వజమెత్తారు. 

రాజకీయంగా వైఎస్సార్‌సీపీని నిలువరించేందుకు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ చేసే కుట్రలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలుకుని కేంద్రంలో ఎఫ్‌డీఐ బిల్లు సందర్భంగా ముగ్గురు టీడీపీ ఎంపీల గైర్హాజరుతోపాటు ఇటీవలి కాలంలో రాష్ట అసెంబ్లీలో ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్‌ను రక్షించేందుకు చంద్రబాబు చేసుకున్న కుమ్మక్కులను ఆయన ఒక్కొక్కటిగా వివరించారు.

ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకే జరుగుతున్నదని తెలిపారు. మూడేళ్లుగా కాంగ్రెస్‌తో బాబు నడిపిస్తున్న ఈ చీకటి వ్యవహారాలను ఎప్పటికప్పుడు ఆధారాలతోసహా తాము నిరూపిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని చెప్పారు. ఇలాంటి వ్యక్తి లోక కల్యాణంకోసం పాటుపడుతున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అధికార దాహంతో సొంత మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచి మరణానికి కారకుడైన వ్యక్తి నీతులు వల్లించడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తనకు సైకిల్‌గుర్తు ఎలా వచ్చిందో? పార్టీ కార్యాలయం ఏవిధంగా నిర్మించారో? కొడుకు లోకేష్ చదువులు అమెరికాలో ఎలా కొనసాగాయో ప్రజలకు వివరించగలరా? అని గడికోట సూటిగా ప్రశ్నించారు.

మీకు పార్లమెంటు, మాకు అసెంబ్లీ!
కేంద్ర మంత్రి చిదంబరంను చీకట్లో కలిసి తనపై ఉన్న కేసులు విచారణకు రాకుండా చూసుకున్న చంద్రబాబు... కాంగ్రెస్‌కు అవసరం వచ్చిన ప్పుడల్లా ఆపన్నహస్తం అందిస్తున్నారని శ్రీకాంత్ ఆరోపించారు. ప్రజాసమస్యలు విస్మరించి సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలు నిత్యం ఢిల్లీ పర్యటనలు చేస్తున్నా బాబుకు పట్టదన్నారు. చీకట్లో కుదిరిన ఒప్పందం మేరకు కాంగ్రెస్.. పార్లమెంటు, టీడీపీ అసెంబ్లీ స్థానాలకు ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించారని పేర్కొ న్నారు. తమను ఎన్ని కష్టనష్టాలకు గురిచేసినా వైఎస్ కుటుంబం ప్రజలకోసం మొక్కవోని ధైర్యంతో ముం దుకు సాగుతోందన్నారు. వైఎస్ జగన్‌పై సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ జరపట్లేదని, అదంతా లోపభూయిష్టంగా ఉందని చెప్పారు. వైఎస్ ఇమేజ్‌ను దెబ్బతీసేం దుకు, జగన్‌ను అణచివేసేందుకు కాంగ్రెస్, టీడీపీలు కలిసి సీబీఐతో నాటకమాడిస్తున్నాయన్నారు.

‘‘ఏం సర్కారమ్మా ఇది..!

* పాలించేవాని హస్తవాసే బాగోలేదు: షర్మిల వద్ద మామిడి రైతు ఆవేదన
* మంగు తెగులు సోకి నష్టాల పాలవుతున్నా సాయం లేదు
* వైఎస్ ఉన్నప్పుడు ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారమిచ్చారు
* తెగులు సోకిన కాయకు రేటు రావట్లేదు.. అప్పులెలా తీర్చాలో!
* రైతుల రక్తం పిండుకొని తాగే ప్రభుత్వమిది: షర్మిల
* ధైర్యం కోల్పోవద్దు.. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది
* అవకాశం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ధి చెప్పండి

‘‘ఏం సర్కారమ్మా ఇది..! రాజు మంచోడైతే రాజ్యం బాగుండేది. పాలించేవాని హస్తవాసే మంచిది కాదమ్మా.. మాయకాలం కాకపోతే కురవాల్సిన సమయంలో చుక్క చినుకు రాలలేదమ్మా... తీరా మామిడి కాయ పిందెపట్టిన తరువాత ఫిబ్రవరిలో వర్షం కురిసింది. మామిడి కాయలకు మంగు తెగులు సోకింది. వైఎస్సార్ ఉన్నప్పుడు మంగు రాకుండా సబ్సిడీ మీద మందులు ఇచ్చారమ్మా... బాగా నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏ సాయం లేదమ్మా.

ఈ మంగు సోకిన కాయను కోసుకొని మార్కెట్‌కు పోతే టన్నుకు రూ.2,000 రూ.3,000 మించి ధర పడటం లేదమ్మా. ఈ డబ్బు తెచ్చి అప్పు ఎలా కట్టాలమ్మా’’ అని పశ్చిమ గోదావరి జిల్లా రాళ్లకుంటకు చెందిన మామిడి రైతు వెంకట్రావు.. షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు దొండకాయ రైతు సింధనీడి రంగారావు మాట్లాడుతూ.. ‘‘సాగు చేసి అప్పుల పాలయ్యాను, ప్రభుత్వం మా మొఖం కూడా చూడటం లేదమ్మా’’ అని గోడు చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘ఇది రాబందుల రాజ్యం.. రైతుల రక్తం పిండుకొని తాగే ప్రభుత్వం. వీళ్లకు మానవత్వం లేదు.. రైతులు కష్టాల్లో ఉంటే కనీసం పలకరించడానికి కూడా మనుసు లేని ఈ నాయకులు అసలు మనుషులేనా? అమ్మా...! అయ్యా..! గుండె ధైర్యం కోల్పోవద్దు.

కొద్దిగా ఓపిక పట్టండి. త్వరలోనే జగనన్న నాయకత్వంలో మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది’’ అని రైతులకు, పేదలకు భరోసా ఇచ్చారు. ‘‘అవకాశం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, దానికి అండగా నిలబడిన టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పండి’’ అని ఆమె పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని పల్లెల మీదుగా సాగింది. మార్గమధ్యంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, కూలీలతో షర్మిల మాట్లాడారు.

ఇది చంద్రబాబు పాలన రెండో భాగం
యాత్రలో పలు సందర్భాల్లో షర్మిల మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో రైతులను పురుగులను చూసినట్లు చూశారు. వ్యవసాయం దండగన్నారు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలు వేసి చెప్పారు.. రూ. వేలకు వేలు కరెంటు బిల్లులు వేసి రైతులను, పల్లెలను పీల్చి పిప్పిచేశారు.. ఇప్పుడు ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన కూడా చంద్రబాబు పాలన మాదిరిగానే సాగుతోంది. ఇది చంద్రబాబు పాలన రెండో భాగం.

ఈ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చి ఉంటే ప్రభుత్వం కూలిపోయి, ప్రజల మీద కరెంటు భారం పడకుండా ఉండేది. కానీ అలా చేయలేదు. ప్రభుత్వానికి రక్షణగా నిలబడి కాపాడారు. కరెంటు భారం ప్రజలపై మోపిన పాపంలో కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు చంద్రబాబుకు కూడా భాగం ఉంది. అమ్మా... అక్కా... సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ధిచెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలన్నీ జగనన్న కొనసాగిస్తారు’’ అని అన్నారు.

శ్రీనివాసుడిని దర్శించుకున్న షర్మిల
చిన్న తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన ద్వారకాతిరుమలలో షర్మిల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. తొలిమెట్టు వద్ద వేంకటేశ్వరస్వామికి దండం పెట్టుకొని 42 మెట్లెక్కి దక్షిణ గోపురం ద్వారా షర్మిల సామాన్య భక్తురాలిగానే ఆలయంలోకి ప్రవేశించారు. అప్పటికే పాదయాత్ర సమన్వయకర్త తలశిల రఘురాం శీఘ్రదర్శనం టిక్కెట్లు కొని సిద్ధంగా ఉంచారు. శీఘ్రదర్శనం క్యూలో కూడా జనం ఉండటంతో ఆమె కూడా సాధారణ భక్తురాలిగానే క్యూలో నుంచి ఆలయ గర్భగుడిలోకి వెళ్లారు. వేదపండితులు గోత్రనామాలతో అర్చన చేశారు. ఆలయ ప్రాశస్తిని షర్మిలకు వివరించారు. తీర్థప్రసాదాలను స్వీకరించిన ఆమె ఉత్తర గోపురం ద్వారా ఆలయం నుంచి బయటికి వచ్చారు.

12.2 కిలోమీటర్ల మేర నడక..
షర్మిల పాదయాత్ర 152వ రోజు శనివారం పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకా తిరుమల నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి రాళ్లకుంట, అయ్యవరం గ్రామాల మీదుగా నడచుకుంటూ షర్మిల కొత్తగూడెం చేరుకొని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.10 గంటలకు చేరుకున్నారు. శనివారం మొత్తం 12.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,026.1 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది.

పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్యేలు తానేటి వనిత, ఆళ్ల నాని, జోగి రమేశ్, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, బొడ్డు భాస్కర రామారావు, నేతలు కాపు భారతి, వైఎస్ కొండారెడ్డి, డాక్టర్ హరికృష్ణ, బొడ్డు వెంకట రమణ చౌదరి, మొవ్వ ఆనంద శ్రీనివాసు, స్థానిక నాయకులు తలారి వెంకట్రావు, డి.సువర్ణరాజు, పాశం రామకృష్ణ తదితరులు ఉన్నారు.
Topics :

Popular Posts

 
Support : Home | Web | News | Portal | Images | ysrcongress | Copy Right and Discliamer
. © . YSR -
by Website . .
powered by o