Home »
» 15 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ ముమ్మరంగా సభ్యత్వం
15 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ ముమ్మరంగా సభ్యత్వం
|
|
|
|
|
|
హైదరాబాద్: సభ్యత్వ కార్యక్రమాన్ని వచ్చే నెల 15 నుంచి ముమ్మరం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగానే ‘గడప గడపకూ వైఎస్సార్’ అనే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. శుక్రవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో 12 జిల్లాల సమీక్ష సమావేశం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విజయవాడ సిటీ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల కన్వీనర్లు, కోఆర్డినేటర్లు, పరిశీలకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. |
|
0 comments:
Post a Comment