16 నుంచి గుంటూరులో మలివిడత ఓదార్పు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 16 నుంచి గుంటూరులో మలివిడత ఓదార్పు

16 నుంచి గుంటూరులో మలివిడత ఓదార్పు

Written By news on Sunday, November 13, 2011 | 11/13/2011

గుంటూరు, న్యూస్‌లైన్: గుంటూరు జిల్లాలో మలివిడత ఓదార్పు యాత్ర ఈ నెల 15 నుంచి కాకుండా 16 నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ వెల్లడించారు. ఓదార్పు కుటుంబం నుంచి మరో ఓదార్పు కుటుంబానికి వెళ్ళే మార్గం మధ్యలోని గ్రామాల్లో మాత్రమే యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి తమ గ్రామాలకు రావాలని ఎవరూ అడ్డుపడవద్దని విజ్ఞప్తి చేశారు. 

శనివారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో యాత్ర షెడ్యూల్‌ను మర్రి రాజశేఖర్ ప్రకటించారు. మొదటి విడత ముగిసిన రేపల్లె నియోజకవర్గం నుంచే రెండో విడత ప్రారంభమవుతుందని తెలిపారు. రేపల్లె తర్వాత బాపట్ల, ప్రత్తిపాడు, పొన్నూరు, తాడికొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో యాత్ర జరుగుతుందని పేర్కొన్నారు.
Share this article :

0 comments: