కూచినపూడి: గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న మలివిడుత ఓదార్పుయాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూచినపూడికి చేరుకున్నారు. కూచినపూడిలో జగన్కు భారీ ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. కూచినపూడిలో ఏర్పాటు చేసిన సమావేశానికి పెద్త ఎత్తున ప్రజలు తరలివచ్చారు. పేద ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రారంభించిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు ప్రతి క్షణం స్మరించుకుంటూనే ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న మలి విడుత ఓదార్పుయాత్రలో భాగంగా జగన్ అడవులదీవి గ్రామానికి చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పథకాలు ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయాయని జగన్ అన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, వృద్దాప్య ఫించన్ లాంటి పథకాలు పేద ప్రజలకు అండగా నిలిచాయన్నారు
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు ప్రతి క్షణం స్మరించుకుంటూనే ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న మలి విడుత ఓదార్పుయాత్రలో భాగంగా జగన్ అడవులదీవి గ్రామానికి చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పథకాలు ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయాయని జగన్ అన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, వృద్దాప్య ఫించన్ లాంటి పథకాలు పేద ప్రజలకు అండగా నిలిచాయన్నారు
0 comments:
Post a Comment