ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు నడుచుకుంటానని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. పల్నాటి వీరారాధనోత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన ఆదివారం కారంపూడి వచ్చారు. వీరులగుడిలో జరిగిన కోడిపోరు ప్రదర్శనను తిలకించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ నోటీసు ఇచ్చిన తర్వాత ఓటు వేసే విషయం మాట్లాడదామన్నారు.
తన రాజీనామాను ఆమోదించవద్దని స్పీకర్ను కోరినట్లు వచ్చిన వార్తలు మీడియా సృష్టే ్టనన్నారు. స్పీకర్కు తనకు మధ్య జరిగిన సంభాషణలు వారికి ఎలా తెలుస్తాయని, వారికి కావాల్సిన విధంగా వారు వార్తలు రాసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎప్పటికీ జగన్మోహన్రెడ్డే తమ నాయకుడని, కడవరకు ఆయన వెంటే ఉంటానని స్పష్టం చేశారు. కారంపూడి వీరుల గుడి ప్రాంగణాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే విషయమై ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డితో చర్చించినట్లు తెలిపారు. నిధుల మంజూరు, గుడి అభివృద్ధికి తాను కృషి చేస్తానని చెప్పారు. భవిష్యత్లో పల్నాడు ఉత్సవాలు మాచర్లలో నిర్వహించేలా కృషి చేస్తానన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాయితి వెంకట నర్శిరెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీపీ చల్లా రాంబాబు, అక్బర్, నారపరెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తన రాజీనామాను ఆమోదించవద్దని స్పీకర్ను కోరినట్లు వచ్చిన వార్తలు మీడియా సృష్టే ్టనన్నారు. స్పీకర్కు తనకు మధ్య జరిగిన సంభాషణలు వారికి ఎలా తెలుస్తాయని, వారికి కావాల్సిన విధంగా వారు వార్తలు రాసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎప్పటికీ జగన్మోహన్రెడ్డే తమ నాయకుడని, కడవరకు ఆయన వెంటే ఉంటానని స్పష్టం చేశారు. కారంపూడి వీరుల గుడి ప్రాంగణాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే విషయమై ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డితో చర్చించినట్లు తెలిపారు. నిధుల మంజూరు, గుడి అభివృద్ధికి తాను కృషి చేస్తానని చెప్పారు. భవిష్యత్లో పల్నాడు ఉత్సవాలు మాచర్లలో నిర్వహించేలా కృషి చేస్తానన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాయితి వెంకట నర్శిరెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీపీ చల్లా రాంబాబు, అక్బర్, నారపరెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment