అనంతవరం(తుళ్లూరు), న్యూస్లైన్: అనంతవరం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ రావిబత్తిన మల్లికార్జునరావు సోమవారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు మందపాటి శేషగిరిరావు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయనతో పాటు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కట్లగుంట రమేష్, ఎనికేపాటి రవి, మాదల సుబ్బారావు, మాదల శేషగిరిరావు, పిన్నమనేని సాంబశివరావు, నీరుకొండ కోటేశ్వరరావు, పురమ పుల్లారావు, గొట్టిముక్కల వెంకటేశ్వరరావుతోపాటు మరో 40 మంది పార్టీ లో చేరారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుంటుపల్లి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుమారు 20 మంది రూ.100 సభ్యత్వం తీసుకోగా మరో 30 మంది సాధారణ సభ్యత్వం తీసుకున్నారు. డాక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ వైఎస్ పథకాలకు ఆకర్షితుడినయ్యానని, ఆ పథకాలు మళ్లీ ప్రజలకు చేరువ కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వారిలో తానూ ఒకడినని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ముఖ్యమంత్రి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. శేషగిరిరావు మాట్లాడుతూ జగన్ సీఎం అయితేనే మేలు జరుగుతుందని భావించి ప్రతి ఒక్కరూ పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు కుటుంబరావు, కొమ్మినేని కృష్ణారావు, బుర్రా వెంకటశివారెడ్డి, అట్లూరి శ్రీనివాసరెడ్డి, అమర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు
అబ్బినేనిగుంటపాలెం గ్రామానికి చెందిన 50 మంది మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓదార్పుయాత్రలో భాగంగా గ్రామానికి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ కృష్ణా జిల్లా ఇన్చార్జి రావి వెంకటరమణ ఆధ్వర్యంలో వారు కలిశారు. తామంతా వైఎస్సార్ కాంగ్రెస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. జగన్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. వీరు గతంలో ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుంటుపల్లి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుమారు 20 మంది రూ.100 సభ్యత్వం తీసుకోగా మరో 30 మంది సాధారణ సభ్యత్వం తీసుకున్నారు. డాక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ వైఎస్ పథకాలకు ఆకర్షితుడినయ్యానని, ఆ పథకాలు మళ్లీ ప్రజలకు చేరువ కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వారిలో తానూ ఒకడినని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ముఖ్యమంత్రి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. శేషగిరిరావు మాట్లాడుతూ జగన్ సీఎం అయితేనే మేలు జరుగుతుందని భావించి ప్రతి ఒక్కరూ పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు కుటుంబరావు, కొమ్మినేని కృష్ణారావు, బుర్రా వెంకటశివారెడ్డి, అట్లూరి శ్రీనివాసరెడ్డి, అమర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు
అబ్బినేనిగుంటపాలెం గ్రామానికి చెందిన 50 మంది మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓదార్పుయాత్రలో భాగంగా గ్రామానికి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ కృష్ణా జిల్లా ఇన్చార్జి రావి వెంకటరమణ ఆధ్వర్యంలో వారు కలిశారు. తామంతా వైఎస్సార్ కాంగ్రెస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. జగన్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. వీరు గతంలో ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు
0 comments:
Post a Comment