విజయసాయి రెడ్డి ఛాలెంజ్ ని సిబిఐ స్వీకరించాలి- జూపూడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయసాయి రెడ్డి ఛాలెంజ్ ని సిబిఐ స్వీకరించాలి- జూపూడి

విజయసాయి రెడ్డి ఛాలెంజ్ ని సిబిఐ స్వీకరించాలి- జూపూడి

Written By news on Saturday, November 12, 2011 | 11/12/2011

హైదరాబాద్: ఆడిటర్ విజయసాయి రెడ్డి ఛాలెంజ్ ని సిబిఐ స్వీకరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఈ మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయసాయి రెడ్డి లేఖని సిబిఐ స్వీకరించాలన్నారు. డెలాయిట్ సుదర్శన్, విజయసాయి రెడ్డిలను ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించగలరా? అని ఆయన సిబిఐ అధికారులను అడిగారు. 

నష్టాల్లో ఉన్న రామోజీరావు సంస్థ ఈనాడు షేర్ ని ఎక్కువ ధరకు అమ్మవచ్చు, కొత్తగా పెట్టిన సాక్షి పత్రిక షేరుని ఎక్కువ ధరకు అమ్మకూడదా? అని ఆయన ప్రశ్నించారు. ఈనాడు మిషనరీ స్క్రాప్ అని, అదే సాక్షి విషయానికి వస్తే అన్నీ ఆధునిక సాంకేతి పరిజ్ఞానంతో కూడిన కొత్త యంత్రాలని తెలిపారు. మూతబడిపోయిన పత్రికని ఒక విలేకరి కోట్ల రూపాయలతో ఎలా ప్రారంభించారని ఆయన ప్రశ్నించారు. 


సిబిఐ వ్యవహార శైలిని ఆయన తప్పుపట్టారు. సిబిఐ కాంగ్రెస్, చంద్రబాబు నాయుడుల జేబు సంస్థగా మారడాన్ని తాము ఒప్పుకోమన్నారు. ఏ శాఖలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయో ఆ శాఖ మంత్రులను విచారించడంలేదన్నారు. ఆ శాఖ కార్యదర్శులను విచారించడంలేదని తప్పుపట్టారు. పొంతనలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలా పదేపదే తప్పుడు ప్రచారాలు చేసింతమాత్రాన జగన్మోహన రెడ్డిని ఏమీ చేయలేరని ఆయన అన్నారు. ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారం మానుకోవాలని సలహా ఇచ్చారు. కుట్రపూరితమైన ప్రచారానికి తెరదించాలన్నారు.
Share this article :

0 comments: