వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పాలమర్రు గ్రామంలో ఎడ్ల బండిపై ఎక్కారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఈ సాయంత్రం ఆయన ఈ గ్రామానికి వచ్చారు. ఎడ్ల బండి ఎక్కిన జగన్మోహన రెడ్డిని చూసిన గ్రామస్తులు ఎంతో ఆనందంగా, ఉత్సాహంతో ఘనస్వాగతం పలికారు.
పత్తి రైతులకు గిట్టుబాట ధర దక్కడంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. పత్తి పంట దిగుబడి 15 క్వింటాళ్ల వరకు ఉండేదని, ఇప్పుడు విద్యుత్ లేక నాలుగు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. దివంగత వైఎస్ఆర్ హయాంలో 6 వేల రూపాయల వరకు గిట్టుబాటు ధర కల్పిస్తే, ఈ ప్రభుత్వం 3 వేల 600 రూపాయలతో సరిపెడుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో గ్రామీణ ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్నారు. వీటిని పట్టించుకునే నాధుడే లేడన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రాక సందర్భంగా పెదనందిపాడు జనసంద్రమైంది. జగన్ వస్తున్నారని తెలిసి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఓదార్పు యాత్రలో భాగంగా రాత్రి 7.30 గంటల ప్రాంతంలో జగన్ ఈ గ్రామానికి వచ్చారు. అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గ్రామమంతా జనంతో నిండిపోయింది. వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. జగన్ ప్రసంగానికి విశేష స్పందన లభించింది.
పత్తి రైతులకు గిట్టుబాట ధర దక్కడంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. పత్తి పంట దిగుబడి 15 క్వింటాళ్ల వరకు ఉండేదని, ఇప్పుడు విద్యుత్ లేక నాలుగు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. దివంగత వైఎస్ఆర్ హయాంలో 6 వేల రూపాయల వరకు గిట్టుబాటు ధర కల్పిస్తే, ఈ ప్రభుత్వం 3 వేల 600 రూపాయలతో సరిపెడుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో గ్రామీణ ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్నారు. వీటిని పట్టించుకునే నాధుడే లేడన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రాక సందర్భంగా పెదనందిపాడు జనసంద్రమైంది. జగన్ వస్తున్నారని తెలిసి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఓదార్పు యాత్రలో భాగంగా రాత్రి 7.30 గంటల ప్రాంతంలో జగన్ ఈ గ్రామానికి వచ్చారు. అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గ్రామమంతా జనంతో నిండిపోయింది. వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. జగన్ ప్రసంగానికి విశేష స్పందన లభించింది.
0 comments:
Post a Comment