రచ్చబండను అడ్డుకున్న మహిళలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రచ్చబండను అడ్డుకున్న మహిళలు

రచ్చబండను అడ్డుకున్న మహిళలు

Written By news on Friday, November 11, 2011 | 11/11/2011


హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమం పలుచోట్ల రసాభాసగా మారింది. కరీంనగర్ జిల్లా జూలపల్లిలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమాన్ని మహిళలు శుక్రవారం అడ్డుకున్నారు. రూపాయికి కిలో బియ్యం తమకు వద్దని.... నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలంటూ వారు ఆందోళనకు దిగారు. 

గుంటూరు జిల్లా తాడేపల్లిలో రచ్చబండ కార్యక్రమంలో మహానేత వైఎస్ఆర్ ఫోటో లేదంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. కాగా ప్రజా సమస్యల గురించి నిలదీస్తున్నవారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఎమ్మెల్యే కమల సమక్షంలోనే పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఈ సంఘటనలో ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. దాంతో ఎమ్మెల్యే కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.
Share this article :

0 comments: