హైదరాబాద్: డెలాయిట్ కంపెనీ అంచనాలపై ఆ కంపెనీ సీనియర్ డైరెక్టర్ తో ముఖాముఖీకి సిద్ధమని 'సాక్షి' వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి సవాల్ విసిరారు. డెలాయిట్ కంపెనీ అంచనాలపై సిబిఐకి విజయసాయిరెడ్డి ఒక లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షిపై కక్షకట్టిన పత్రికల్లో వస్తున్నకథనాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డెలాయిట్ అంచనాల వ్యవహారంపై నిజాలు నిగ్గు తేలుస్తామన్నారు. కొందరు వ్యక్తుల వత్తడికి తలొగ్గి సుదర్శన్ వాంగ్మూలం ఇచ్చినట్లు అర్ధమవుతోందన్నారు. సుదర్శన్ సమక్షంలో అతని వాదన తప్పని నిరూపించడానికి అవకాశం ఇవ్వమని ఆయన సిబిఐని కోరారు. ఎల్లో మీడియా ప్రచారాన్ని తిప్పికొట్టడానికే సిబిఐకి రాసిన లేఖని బహిరంగపరిచినట్లు ఆయన చెప్పారు. మేజిస్ట్రేట్ ముందు ఇచ్చినట్లు చెబుతున్న వాంగ్మూలం తనకు ఇవ్వకుండా సాక్షిని వ్యతిరేకించేవారికి ఎలా చేరిందని ఆయన ప్రశ్నించారు.ఇదే డెలాయిట్ సుదర్శన్ 1800 కోట్ల రూపాయల నష్టంలో ఉన్న ఈనాడుని కూడా వ్యాల్యూయేషన్ చేశారన్నారు.
డెలాయిట్ నివేదికకు, సాక్షిలోకి పెట్టుబడుల రాకకు ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. సాక్షిలోకి పెట్టుబడులు ఆగస్టు 2007 నుంచే వచ్చాయని, డెలాయిట్ నివేదిక నవంబర్ లో వచ్చిందని ఆయన వివరించారు.
డెలాయిట్ నివేదికకు, సాక్షిలోకి పెట్టుబడుల రాకకు ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. సాక్షిలోకి పెట్టుబడులు ఆగస్టు 2007 నుంచే వచ్చాయని, డెలాయిట్ నివేదిక నవంబర్ లో వచ్చిందని ఆయన వివరించారు.
0 comments:
Post a Comment