వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ విచారణకు ఆదేశించడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబులో తీవ్ర ఆందోళన కనిపించింది. ఆ ఆందోళనలోనే ట్రాక్టర్ నడిపి ఓ చానల్ కెమెరామన్ను గాయపరిచారు. విజయనగరంజిల్లాలో రైతుపోరుబాటలో ఉండగానే ఆయనకు ఈ సమాచారం అందింది. దీంతో ఆయన ముఖ కవళికలు మారిపోయాయి. కాసేపు ఎవరితోనూ మాట్లాడలేదు. తర్వాత తన భావోద్వేగాలను అదుపు చేసుకుంటూ యాత్రను కొనసాగించారు.
లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట సమీపంలో ట్రాక్టర్ నడిపే ప్రయత్నం చేశారు. అసలే ఆందోళనలో ఉన్న చంద్రబాబు దాన్ని అదుపుచేయలేకపోయారు. ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న ఓ చానల్ కెమెరామన్ కాలిపైకి ట్రాక్టర్ వెళ్లింది. పక్కనే ఉన్న డ్రైవర్ అప్రమత్తమై ట్రాక్టర్ను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో చంద్రబాబు గోల్డ్స్టార్ జంక్షన్లో కాన్వాయిని నిలిపివేయమన్నారు. 2.15 గంటల నుంచి 2.45 నిమిషాల వరకు వాహనంలోనే కూర్చుని సుదీర్ఘంగా ఫోన్లో చర్చించారు.
అప్పటికే పలు మార్లు ఫోన్లు రావడం, మాట్లాడుతూనే యాత్ర కొనసాగిస్తూ ప్రజలకు అభివాదం చేయడం చూసిన తెలుగు తమ్ముళ్లు... కాన్వాయి నిలిచిపోవడంతో ఏం జరిగి ఉంటుందా అని ఉత్కంఠకు లోనయ్యారు. ఫోన్ ఫోన్కీ బాబు ముఖ కవళికలు మారిపోవడం కూడా కార్యకర్తలను ఆందోళనకు గురిచేసింది. సాయంత్రం 4 గంటలకు భోజన విరామానంతరం కూడా చంద్రబాబు 5.15 వరకు తన వాహనంలోనే విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ఫొటో ప్రదర్శన తిలకించి 5.30కు తిరిగి పాదయాత్ర ప్రారంభించారు.
లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట సమీపంలో ట్రాక్టర్ నడిపే ప్రయత్నం చేశారు. అసలే ఆందోళనలో ఉన్న చంద్రబాబు దాన్ని అదుపుచేయలేకపోయారు. ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న ఓ చానల్ కెమెరామన్ కాలిపైకి ట్రాక్టర్ వెళ్లింది. పక్కనే ఉన్న డ్రైవర్ అప్రమత్తమై ట్రాక్టర్ను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో చంద్రబాబు గోల్డ్స్టార్ జంక్షన్లో కాన్వాయిని నిలిపివేయమన్నారు. 2.15 గంటల నుంచి 2.45 నిమిషాల వరకు వాహనంలోనే కూర్చుని సుదీర్ఘంగా ఫోన్లో చర్చించారు.
అప్పటికే పలు మార్లు ఫోన్లు రావడం, మాట్లాడుతూనే యాత్ర కొనసాగిస్తూ ప్రజలకు అభివాదం చేయడం చూసిన తెలుగు తమ్ముళ్లు... కాన్వాయి నిలిచిపోవడంతో ఏం జరిగి ఉంటుందా అని ఉత్కంఠకు లోనయ్యారు. ఫోన్ ఫోన్కీ బాబు ముఖ కవళికలు మారిపోవడం కూడా కార్యకర్తలను ఆందోళనకు గురిచేసింది. సాయంత్రం 4 గంటలకు భోజన విరామానంతరం కూడా చంద్రబాబు 5.15 వరకు తన వాహనంలోనే విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ఫొటో ప్రదర్శన తిలకించి 5.30కు తిరిగి పాదయాత్ర ప్రారంభించారు.
0 comments:
Post a Comment