రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఒక శని అయితే, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండవ శని అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విమర్శించారు. అసోదివారిపాలెం గ్రామంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ అనంతరం ఆయన ప్రసంగించారు. చంద్రబాబు తన 9 ఏళ్ల పాలనలో విద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచించారా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై ఆ దివంగత మహానేత వైఎస్ఆర్ పై కేసులు పెడుతున్నారని బాధపడ్డారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా తామున్నామని ప్రజలు తనకు భరోసా ఇస్తున్నారని చెప్పారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హనుమాన్ నగర్ లో మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
బాపట్ల మండలం దగ్గుమల్లివారిపాలెంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఈ గ్రామానికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర 27వ రోజుకు చేరింది. శుక్రవారం ఉదయం ఆయన తన యాత్రను బాపట్లలోని టీచర్స్ కాలనీ నుంచి ప్రారంభించారు. ప్యాడిసన్ పేటలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
వెంగళ్ విహార్ లో 22 డ్వాక్రా సంఘాల మహిళలు వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వెంగళ్విహార్లోనూ మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై ఆ దివంగత మహానేత వైఎస్ఆర్ పై కేసులు పెడుతున్నారని బాధపడ్డారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా తామున్నామని ప్రజలు తనకు భరోసా ఇస్తున్నారని చెప్పారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హనుమాన్ నగర్ లో మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
బాపట్ల మండలం దగ్గుమల్లివారిపాలెంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఈ గ్రామానికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర 27వ రోజుకు చేరింది. శుక్రవారం ఉదయం ఆయన తన యాత్రను బాపట్లలోని టీచర్స్ కాలనీ నుంచి ప్రారంభించారు. ప్యాడిసన్ పేటలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
వెంగళ్ విహార్ లో 22 డ్వాక్రా సంఘాల మహిళలు వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వెంగళ్విహార్లోనూ మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు.
0 comments:
Post a Comment