హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాపం పండిందని ఆయన జైలుకెళ్లడం ఖాయమని ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి సోమవారం అన్నారు. బాబు ఆస్తులపై విచారణ జరిపి మూడు నెలల్లోగా సీల్డ్ కవర్లో వివరాలు అందించాలని కోర్టు సోమవారం ఆదేశించింది. దీనికి లక్ష్మీ పార్వతి స్పందించారు. బాబు ఆస్తులపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. ఆరేళ్ల క్రితమే బాబుపై తాను పిటిషన్ వేసినప్పటికీ ఆయన స్టే తెచ్చుకొని విచారణను అడ్డుకున్నారన్నారు. ఇటీవల కూడా ఆయన స్టేను పొడిగించుకున్నారన్నారు.
బాబు ఆస్తులపై విచారణ జరగటం ప్రజల నైతిక విజయమన్నారు. ఇన్నాళ్లూ ప్రజలను మోసగిస్తూ వచ్చిన నాయకుడు ఇప్పుడు దొరికి పోతున్నారన్నారు. విచారణ ద్వారా బాబు అక్రమాలు అన్నీ బయటకొస్తాయన్నారు. నిజాలు అన్నీ బయటకు వస్తే అందరికంటే ముందు జైలుకెళ్లేది బాబే అన్నారు. హైకోర్టు నిర్ణయంతో బాబు అక్రమాస్తులు బయటకొస్తాయని, రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు.
బాబు ఆస్తులపై విచారణ జరగటం ప్రజల నైతిక విజయమన్నారు. ఇన్నాళ్లూ ప్రజలను మోసగిస్తూ వచ్చిన నాయకుడు ఇప్పుడు దొరికి పోతున్నారన్నారు. విచారణ ద్వారా బాబు అక్రమాలు అన్నీ బయటకొస్తాయన్నారు. నిజాలు అన్నీ బయటకు వస్తే అందరికంటే ముందు జైలుకెళ్లేది బాబే అన్నారు. హైకోర్టు నిర్ణయంతో బాబు అక్రమాస్తులు బయటకొస్తాయని, రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు.
0 comments:
Post a Comment