17 మంది ఎమ్మెల్యేలను గెలిపించాలి: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 17 మంది ఎమ్మెల్యేలను గెలిపించాలి: జగన్

17 మంది ఎమ్మెల్యేలను గెలిపించాలి: జగన్

Written By ysrcongress on Wednesday, December 28, 2011 | 12/28/2011

లక్కిరెడ్డిపల్లె: నాయకుడంటే పదవుల హోదాల కోసమే పాకులాడకుండా పేదవాడి గోడును కూడా పట్టించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలకు ఆ తపన లేదు కాబట్టే అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. ఓదార్పుయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె చేరుకున్న ఆయన మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

వేలాదిగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి జగన్ ఈ సందర్భంగా ప్రసంగించారు. రైతు బతుకును ఛిద్రం చేసిన సర్కారు తీరుకు నిరసనగా 17 మంది వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు పదవులను త్యాగం చేసేందుకు సిద్ధపడడం రాష్ట్ర చరిత్రలో తొలిసారన్నారు. విలువలకు, విశ్వసనీయతకు మద్దతు పలికిన ఆ ప్రజా ప్రతినిధులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కిరణ్ సర్కారు తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని జగన్ అన్నారు.
 
 
 
రామాపురం: వైఎస్సార్ జిల్లాలో ఓదార్పుయాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ బుధవారం సాయంత్రం రామాపురం చేరుకున్నారు. అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇక్కడ ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పక్షాన నిలిచిన వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
Share this article :

0 comments: