నంబూరులో గ్రామస్తులు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 5 విగ్రహాలను ఏర్పాటు చేశారు. వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి వస్తున్న సందర్భంగా, ఆయనచేత ఆవిష్కరింపజేయాలని వారు ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. అభిమానులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామం అంతా నినాదాలతో హొరెత్తింది. జగన్ ఆ మహానేత రెండు విగ్రహాలను ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జగన్ ఎస్ సి కాలనీలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తరువాత మిగిలిన విగ్రహాలను కూడా జగన్ ఆవిష్కరిస్తారు.
అనంతరం జగన్ ఎస్ సి కాలనీలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తరువాత మిగిలిన విగ్రహాలను కూడా జగన్ ఆవిష్కరిస్తారు.
0 comments:
Post a Comment