ఎటువంటి పరిణామాలు ఎదురు అయినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వైఎస్ అభిమాన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆదివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తాను తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు.
ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే పులివెందుల బై ఎలక్షన్ ఫలితాలే పునరావృతం అవుతాయని కాపు రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాయదుర్గంలో ఉప ఎన్నికలు జరిగితే 50వేల మెజార్టీతో గెలుస్తామని ఆయన అన్నారు. ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని రామచంద్రారెడ్డి తెలిపారు.
0 comments:
Post a Comment