100 డాలర్ల ఈక్విటీ సంస్థకు 3 కోట్ల డాలర్ల రుణం ఇచ్చారట!
మారిషస్ మార్గంలో నల్లధనం తీసుకొస్తున్న సుజనా గ్రూపు సంస్థలు
విదేశీ సబ్సిడరీల నుంచి మాతృ సంస్థలకు రూ. 850 కోట్లు బదిలీ
ఆ సంస్థల టర్నోవర్, విదేశీ బ్యాంకులు, రుణమూ అన్నీ బూటకమే!
రుణం పేరుతో నల్లడబ్బు తెచ్చి తెల్లడబ్బుగా చలామణి చేస్తున్న వైనం
బినామీ బంధం: సుజనా సంస్థ కోసం చంద్రబాబు హెరిటేజ్ భూమి తాకట్టు..
చౌదరి ‘సేవలకు’ ప్రతిఫలంగా రాజ్యసభ సీటు.. దీని భావమేమి?
నిర్జీవ పదార్థం నుంచి జీవం పుట్టిందని సైన్స్ చెప్తుంది! కానీ.. ఆయన శూన్యం నుంచి వేల కోట్ల రూపాయల సొమ్ములు సృష్టించారు. శూన్యం నుంచే లక్ష కోట్ల రూపాయల రుణాలు పుట్టించారు. అదే శూన్యం నుంచి లక్ష కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం నిర్మించారు. ఆ శూన్య సామ్రాజ్యాన్ని విదేశాలకూ విస్తరించారు. అలా.. విదేశాల నుంచి నల్లధనాన్ని స్వదేశంలోకి తెల్లధనంగా ప్రవహింప చేసుకోవటానికి రాజమార్గం వేసుకున్నారు. ఆ మార్గంలో వందలు, వేల కోట్ల రూపాయలు రప్పిస్తున్నారు కూడా! ఇంత మేజిక్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరైనా కొమ్ములు తిరిగిన మెజీషియనా అంటే.. కాదు. కేవలం కాగితాలపై రాతలతో ఇంత గిమ్మిక్కు చేస్తున్న సదరు మహా మాయావి మరెవరో కాదు.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా.. ఇంకా చెప్పాలంటే.. చంద్రబాబుకు బినామీగా జనమెరిగిన సుజనాచౌదరి! చంద్రబాబుకు చేస్తున్న ‘సాయానికి’ ప్రతిఫలంగా టీడీపీ నుంచి రాజ్యసభ సీటు కూడా దక్కించుకున్న సుజనా చౌదరి.. అన్ని రకాల చట్టాలనూ తుంగలో తొక్కుతూ.. సెబీని, స్టాక్ ఎక్స్ఛేంజీలను, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ను ఏమారుస్తూ.. ఏళ్ల తరబడి నిరాఘాటంగా సాగిస్తున్న ఘరానా మోసమిది.
సుజనా గ్రూపు మాయాజాలంపై చాలా కాలం కిందటే అనేక దర్యాప్తు సంస్థల కన్నుపడింది. పలు సంస్థల నుంచి నోటీసులు, సమన్లు అందుకున్న చరిత్ర కూడా సుజనా వారికి ఉంది. అలా అందిన వాణిజ్య పన్నుల శాఖ నోటీసులకు గతంలో సమాధానం ఇస్తూ.. తాము చేసే వ్యాపారమంతా ఉత్తుత్తి వ్యాపారమేనని, కేవలం కాగితాలపై ఘనంగా చూపించుకోవటానికి రాసుకున్న బూటకపు పద్దులు మాత్రమేనని సుజనా గ్రూపు సంస్థలు స్వయంగా వెల్లడించాయి. కానీ.. ఏ దర్యాప్తు సంస్థ చర్యలూ కాగితాల పరిధి దాటలేదు.
డి. శివరామిరెడ్డి, బిజినెస్ బ్యూరో:
సత్యం కంప్యూటర్స్ మంచి వ్యాపారమే చేస్తుండగా.. దానిని మరింత పెద్దదిగా చూపేందుకు ఆ సంస్థ అధినేత రామలింగరాజు కాగితాల్లో టర్నోవర్ పెంచి చూపించారు. ఆ నేరానికి ఆయన దాదాపు రెండేళ్లపాటు జైలులో ఉన్నారు. ఇంకా ఆ కేసు కొనసాగుతోంది. కానీ.. సుజనాచౌదరి అసలు ఏ వ్యాపారమూ లేకుండానే.. పదుల సంఖ్యలో బోగస్ సంస్థలు సృష్టించి, ఆ సంస్థల మధ్యే లక్ష కోట్ల రూపాయల మేర వ్యాపారం జరిగినట్లు టర్నోవర్ చూపించారు. విదేశాల్లో తమ సబ్సిడరీ సంస్థలకు కూడా ఇలాంటి బూటకపు టర్నోవర్ చూపి.. అక్కడి బ్యాంకులు తమకు రుణాలు ఇచ్చాయంటూ కోట్లాది రూపాయల నల్లధనాన్ని దర్జాగా తెల్లధనంగా దేశంలోకి తెస్తున్నారు. ‘సాక్షి’ పరిశోధనలో వెలుగుచూసిన సుజనా మాయాజాలం వివరాలివీ...
రూ. 5 వేల సంస్థలకు.. రూ. 850 కోట్ల రుణాలట!
సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుజనా టవర్స్, సుజనా మెటల్స్.. అనే సంస్థలు సుజనాచౌదరిగా తెలిసిన వై.సత్యనారాయణచౌదరివి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లలో నమోదైన ఈ సంస్థలు ప్రధానంగా చేసే వ్యాపారం.. ఇనుము కొని అమ్మటం. అది కూడా రాష్ట్రంలోను, తమిళనాడులోనూ గల తమ గ్రూపు సంస్థలతోనే. ఆ సంస్థల వార్షిక నివేదికలు చూస్తే ఈ విషయం వెల్లడవుతుంది. సుజనా యూనివర్సల్కు వంద శాతం సబ్సిడరీ సంస్థగా 2007లో మారిషస్లో హెస్తియా హోల్డింగ్స్ లిమిటెడ్ అనే పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేశారు. హెస్తియాలో సుజనా యూనివర్సల్కు ఒకే ఒక్క వాటా ఉంది. ఆ వాటా ముఖ విలువ 100 అమెరికన్ డాలర్లు. అంటే.. ఇది మన కరెన్సీలో 5,200 రూపాయలకు సమానం. ఈ 100 డాలర్ల విలువైన సంస్థకు.. మూడు విదేశీ బ్యాంకులు మూడు కోట్ల డాలర్లు (సుమారు రూ.150 కోట్లు) రుణం ఇచ్చాయని చెప్తున్నారు. ఇందులో.. కోటి డాలర్ల రుణాన్ని మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (హెస్తియా), మరో రెండు కోట్ల డాలర్ల రుణాన్ని స్టాండర్డ్ బ్యాంక్ (సెలీనా), ఆఫ్రేసియా బ్యాంక్ (సెలీనా)లు అందించాయట. ఈ రుణానికి సుజనా యూనివర్సల్ కార్పొరేట్ గ్యారెంటీ ఇచ్చింది.
మాతృ సంస్థల ఖాతాలకు మళ్లింపు...
హెస్తియా హోల్డింగ్స్ 2011 మార్చి నాటికి రూ. 46.33 కోట్ల వ్యాపారం చేసిందని టర్నోవర్ నమోదు చేశారు. నిజానికి దేశీయంగా తమ కంపెనీలు నమోదు చేసిన టర్నోవరే ఉత్తుత్తిదని సుజనా సంస్థలు అధికారికంగా అంగీకరించాయి. అలాంటిది వారు విదేశాల్లో నెలకొల్పిన సంస్థలు స్వదేశంలోని వారి బోగస్ కంపెనీలతో ఏ వ్యాపారం చేస్తాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంటే.. విదేశాల్లోనూ బూటకపు టర్నోవర్ చూపారన్నది స్పష్టమవుతోంది. హెస్తియా నమోదు చేసిన రూ. 46 కోట్ల టర్నోవర్ చూసి.. విదేశీ బ్యాంకులు రూ. 150 కోట్లు రుణంగా ఇచ్చాయని సుజనా సంస్థలు చెప్తున్నాయి. ఇదే తరహాలో సుజనా యూనివర్సల్, సుజనా మెటల్స్ సంస్థలకు సబ్సిడరీ కంపెనీలుగా ఏర్పాటైన సుజనా హోల్డింగ్స్ (దుబాయ్), ఆల్ఫా వెంచర్స్ (కేమాన్ ఐలాండ్స్) కూడా విదేశీ బ్యాంకుల నుంచి రూ. 400 కోట్లు రుణం తీసుకున్నాయి. ఆ విదేశీ రుణానికి మాతృసంస్థలైన సుజనా యూనివర్సల్, సుజనా మెటల్స్ కార్పొరేట్ గ్యారెంటీ ఇచ్చాయి. ఆల్ఫా వెంచర్స్ సంస్థ మారిషస్ బ్యాంకు నుంచి మరో రూ. 300 కోట్లకు పైగా రుణం తీసుకుంది. ఈ రుణానికి సుజనా టవర్స్ కార్పొరేట్ గ్యారెంటీ ఇచ్చింది. మొత్తం కలిపితే.. దాదాపు రూ. 850 కోట్లకు పైగా సొమ్ము విదేశీ రుణం పేరుతో సుజనా సంస్థల సబ్సిడరీ కంపెనీల ఖాతాల్లో చేరింది. ఆ సొమ్ము.. అక్కడి నుంచి.. గ్రూపు సంస్థల మధ్య క్రయవిక్రయాల పేరుతో హైదరాబాద్లోని మాతృ సంస్థలకు వచ్చి చేరింది.
అది రుణమా? నల్లధనమా?
విదేశీ రుణాల పేరుతో అక్కడి సబ్సిడరీ సంస్థలకు.. అక్కడి నుంచి లావాదేవీల పేరుతో స్వదేశంలోని మాతృ సంస్థలకు వచ్చి చేరుతున్నది.. నల్లడబ్బు అని, అది క్రయవిక్రయాల రూపంలో రావటంతో తెల్లడబ్బుగా మారిపోయిందని ఇట్టే అర్ధమవుతుంది. ఎందుకంటే.. కేవలం వంద డాలర్ల ఈక్విటీ ఉన్న సంస్థకు.. ఏకంగా మూడు కోట్ల డాలర్ల రుణాలు జారీ చేసినపుడు.. మారిషస్ బ్యాంకులు కనీస నిబంధనలు కూడా పాటించిన దాఖలాలు లేవు. ఏదైనా సంస్థ తమ గ్రూపులోని ఇతర సంస్థలకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు పూచీకత్తు (కార్పొరేట్ గ్యారంటీ) ఇవ్వాలంటే.. ముందుగా వాటాదారుల అనుమతి తీసుకోవాలి. కంపెనీల చట్టం 1956 లోని సెక్షన్ 372ఎ ప్రకారం ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. బ్యాంకులు కూడా ఈ తీర్మానం ప్రతి ఆధారంగానే సదరు సంస్థకు రుణం ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయిస్తాయి. అయితే.. మారిషస్ బ్యాంకులు ఇలా వాటాదారుల అనుమతి సూచించే తీర్మానం లేకుండానే సుజనా సబ్సిడరీ సంస్థలకు దాదాపు రూ. 850 కోట్ల రుణాన్ని మంజూరు చేశాయట. మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (హెస్తియా), స్టాండర్డ్ బ్యాంక్ (సెలీనా), ఆఫ్రేసియా బ్యాంక్ (సెలీనా) నుంచి హెస్తియా హోల్డింగ్స్ రూ. 150 కోట్ల రుణం తీసుకోవటానికి కార్పొరేట్ గ్యారంటీ సుజనా యూనివర్సల్ ఇచ్చింది. కానీ ఆ సంస్థ ఈ గ్యారంటీకి సంబంధించి తన వాటాదారుల నుంచి ముందుగా అనుమతి తీసుకోలేదు. దానికి సంబంధించిన తీర్మానమూ చేయలేదు. రుణం మంజూరయిన తర్వాత సుజనా యూనివర్సల్ దానికి అనుమతి కోరుతూ వాటాదారుల తీర్మానం కోరటమే దీనికి సాక్ష్యం. సుజనా టవర్స్, సుజనా మెటల్స్ కూడా ఇలాగే వ్యవహరించాయి. అంటే.. ఆయా సంస్థల గ్యారెంటీకి సంబంధించి వాటాదారుల ముందస్తు అనుమతి, తీర్మానం లేకుండానే విదేశీ బ్యాంకులు రుణాలు ఇచ్చేశాయట!
ఆ బ్యాంకులూ బోగస్సేనా?
ఇదంతా చూస్తే.. అసలు వంద డాలర్లు, రెండు వందల డాలర్లు ఈక్విటీ గల సంస్థలకు.. ముందూ వెనుకా చూడకుండా కోట్లకు కోట్లు రుణాలిచ్చేసే బ్యాంకులు ఉన్నాయా అన్న అనుమానం కలగకమానదు. సదరు సంస్థలు చూపుతున్న టర్నోవర్ వాస్తవమైనదా కాదా అన్నది పరిశీలించుకోకుండానే.. చూపిన టర్నోవర్కూ మూడింతలు రుణాలు మంజూరు చేసే బ్యాంకులూ ఉంటాయా అన్న ఆశ్చర్యం కలగక మానదు. దీనినిబట్టి చూస్తే.. ఇక్కడ రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి.. సుజనా సంస్థలు చూపిన టర్నోవర్ లాగానే.. అవి చెప్తున్న విదేశీ బ్యాంకులు కూడా బోగస్వై ఉండాలి. అంటే.. లేని బ్యాంకులు ఉన్నట్లుగా చూపి.. ఆ బ్యాంకులు ఇవ్వని రుణాన్ని ఇచ్చినట్లుగా చూపి.. నల్లధనాన్ని రుణం పేరుతో చెలామణిలోకి తెచ్చుండాలి. లేదంటే.. ఒకవేళ అలాంటి బ్యాంకులంటూ ఉంటే.. అవికూడా నల్లడబ్బు లావాదేవీలకు, దళారీతనానికి కేరాఫ్ అడ్రస్లై ఉండాలి. నల్లధనానికి అడ్డాలైన కేమాన్ ఐలాండ్స్, వర్జిన్ ఐలాండ్స్లలోని బ్యాంకుల్లో నల్లధనం దాచి.. ఆ బ్యాంకులతో కుమ్మక్కై.. ఆ నల్లధనాన్నే తమ సంస్థలకు రుణం రూపంలో తెచ్చుకుంటూ ఉండాలి. ఈ రెండు రకాలుగా కాకుండా.. సుజనా బోగస్ సంస్థలకు అన్ని వందల కోట్ల రూపాయలు రుణం లభించే అవకాశమే లేదు. ప్రస్తుతం ‘సాక్షి’ దృష్టికి వచ్చిన ఉదంతంలో రూ. 850 కోట్లు ఇలా విదేశాల నుంచి సుజనా సంస్థల్లోకి ప్రవహించినట్లు వెల్లడైంది. అయితే.. ఇలాంటి ‘నల్ల’కోణాలు మరిన్ని ఉన్నాయని.. వేల కోట్ల రూపాయలు ఈ మార్గం ద్వారా సుజనా సంస్థల్లోకి ప్రవహిస్తోందని సమాచారం. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ దృష్టి సారించి, లోతుగా దర్యాప్తు చేస్తే కానీ.. ఎన్ని వేల కోట్ల నల్లధనానికి ఇలా తెలుపు రంగు వేసుకుని తెచ్చారన్నది తేటతెల్లంకాదు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, సుజనాచౌదరిల మధ్య గల బంధం ఎలాంటిదో.. హెరిటేజ్ ఫుడ్స్ వాటాదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆ సంస్థ ఆస్తులను ఏ విధంగా కాజేశారో.. గతంలోనే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్కు అనుబంధ సంస్థగా హెరిటేజ్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనే సబ్సిడరీ కంపెనీని సృష్టించారు. హైదరాబాద్లోని కొండాపూర్లో హెరిటేజ్ ఫుడ్స్కు ఉన్న విలువైన 3.42 ఎకరాల భూమిని కేవలం రూ.2.73 కోట్లకు హెరిటేజ్ ఇన్ఫ్రాకు బదలాయించారు. ఈ వ్యవహారం జరిగే రోజుల్లో అంటే 2005 ప్రాంతాల్లో కొండాపూర్లో ఎకరా భూమి విలువ రూ.12 కోట్లు పైమాటే. అయితే హెరిటేజ్ ఇన్ఫ్రాలో చంద్రబాబు భార్య భువనేశ్వరికి 49 శాతం వాటా ఉంది. అందుకే కారుచౌకగా హెరిటేజ్ భూమిని ఇన్ఫ్రాకు బదలాయించారు. ఇక సుజనాచౌదరికి చెందిన శ్రీచక్ర మర్కండైజింగ్ లిమిటెడ్ పెద్దగా కార్యకలాపాలు లేని సంస్థ. తమిళనాడులో రూ.600 అద్దె దుకాణమే దీని కార్యాలయం. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆర్థిక రుణాల సంస్థ సికామ్ లిమిటెడ్ దగ్గర సుజనా రూ.60 కోట్లు అప్పు తీసుకుంది. దీనికి హామీగా హెరిటేజ్ ఇన్ఫ్రా తన దగ్గరున్న 3.47 ఎకారాలను హామీగా పెట్టింది. అంటే.. హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన భూమిని.. సుజనా సంస్థల కోసం.. చంద్రబాబు తన సతీమణి ద్వారా తాకట్టుపెట్టించారన్న మాట. భూమి విలువ కూడా హెరిటేజ్ ఇన్ఫ్రా ఖాతాల్లో ఉన్నంత వరకు రూ.2.73 కోట్లుగా పేర్కొని, రుణ సంస్థ సికామ్ లిమిటెడ్ వద్ద తాకట్టు పెట్టినపుడు భూమి విలువను రూ. 85 కోట్లుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారం తర్వాతే సుజనాచౌదరికి చంద్రబాబు రాజ్యసభ సభ్యత్వాన్ని కానుకగా ఇచ్చారు. అంటే.. ఆ 60 కోట్లు ఎక్కడికి చేరాయో.. సుజనాచౌదరికి రాజ్యసభ సభ్యత్వం ఏ సేవకు ప్రతిఫలమో అర్థం చేసుకోవచ్చు!
మారిషస్ మార్గంలో నల్లధనం తీసుకొస్తున్న సుజనా గ్రూపు సంస్థలు
విదేశీ సబ్సిడరీల నుంచి మాతృ సంస్థలకు రూ. 850 కోట్లు బదిలీ
ఆ సంస్థల టర్నోవర్, విదేశీ బ్యాంకులు, రుణమూ అన్నీ బూటకమే!
రుణం పేరుతో నల్లడబ్బు తెచ్చి తెల్లడబ్బుగా చలామణి చేస్తున్న వైనం
బినామీ బంధం: సుజనా సంస్థ కోసం చంద్రబాబు హెరిటేజ్ భూమి తాకట్టు..
చౌదరి ‘సేవలకు’ ప్రతిఫలంగా రాజ్యసభ సీటు.. దీని భావమేమి?
నిర్జీవ పదార్థం నుంచి జీవం పుట్టిందని సైన్స్ చెప్తుంది! కానీ.. ఆయన శూన్యం నుంచి వేల కోట్ల రూపాయల సొమ్ములు సృష్టించారు. శూన్యం నుంచే లక్ష కోట్ల రూపాయల రుణాలు పుట్టించారు. అదే శూన్యం నుంచి లక్ష కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం నిర్మించారు. ఆ శూన్య సామ్రాజ్యాన్ని విదేశాలకూ విస్తరించారు. అలా.. విదేశాల నుంచి నల్లధనాన్ని స్వదేశంలోకి తెల్లధనంగా ప్రవహింప చేసుకోవటానికి రాజమార్గం వేసుకున్నారు. ఆ మార్గంలో వందలు, వేల కోట్ల రూపాయలు రప్పిస్తున్నారు కూడా! ఇంత మేజిక్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరైనా కొమ్ములు తిరిగిన మెజీషియనా అంటే.. కాదు. కేవలం కాగితాలపై రాతలతో ఇంత గిమ్మిక్కు చేస్తున్న సదరు మహా మాయావి మరెవరో కాదు.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా.. ఇంకా చెప్పాలంటే.. చంద్రబాబుకు బినామీగా జనమెరిగిన సుజనాచౌదరి! చంద్రబాబుకు చేస్తున్న ‘సాయానికి’ ప్రతిఫలంగా టీడీపీ నుంచి రాజ్యసభ సీటు కూడా దక్కించుకున్న సుజనా చౌదరి.. అన్ని రకాల చట్టాలనూ తుంగలో తొక్కుతూ.. సెబీని, స్టాక్ ఎక్స్ఛేంజీలను, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ను ఏమారుస్తూ.. ఏళ్ల తరబడి నిరాఘాటంగా సాగిస్తున్న ఘరానా మోసమిది.
సుజనా గ్రూపు మాయాజాలంపై చాలా కాలం కిందటే అనేక దర్యాప్తు సంస్థల కన్నుపడింది. పలు సంస్థల నుంచి నోటీసులు, సమన్లు అందుకున్న చరిత్ర కూడా సుజనా వారికి ఉంది. అలా అందిన వాణిజ్య పన్నుల శాఖ నోటీసులకు గతంలో సమాధానం ఇస్తూ.. తాము చేసే వ్యాపారమంతా ఉత్తుత్తి వ్యాపారమేనని, కేవలం కాగితాలపై ఘనంగా చూపించుకోవటానికి రాసుకున్న బూటకపు పద్దులు మాత్రమేనని సుజనా గ్రూపు సంస్థలు స్వయంగా వెల్లడించాయి. కానీ.. ఏ దర్యాప్తు సంస్థ చర్యలూ కాగితాల పరిధి దాటలేదు.
డి. శివరామిరెడ్డి, బిజినెస్ బ్యూరో:
సత్యం కంప్యూటర్స్ మంచి వ్యాపారమే చేస్తుండగా.. దానిని మరింత పెద్దదిగా చూపేందుకు ఆ సంస్థ అధినేత రామలింగరాజు కాగితాల్లో టర్నోవర్ పెంచి చూపించారు. ఆ నేరానికి ఆయన దాదాపు రెండేళ్లపాటు జైలులో ఉన్నారు. ఇంకా ఆ కేసు కొనసాగుతోంది. కానీ.. సుజనాచౌదరి అసలు ఏ వ్యాపారమూ లేకుండానే.. పదుల సంఖ్యలో బోగస్ సంస్థలు సృష్టించి, ఆ సంస్థల మధ్యే లక్ష కోట్ల రూపాయల మేర వ్యాపారం జరిగినట్లు టర్నోవర్ చూపించారు. విదేశాల్లో తమ సబ్సిడరీ సంస్థలకు కూడా ఇలాంటి బూటకపు టర్నోవర్ చూపి.. అక్కడి బ్యాంకులు తమకు రుణాలు ఇచ్చాయంటూ కోట్లాది రూపాయల నల్లధనాన్ని దర్జాగా తెల్లధనంగా దేశంలోకి తెస్తున్నారు. ‘సాక్షి’ పరిశోధనలో వెలుగుచూసిన సుజనా మాయాజాలం వివరాలివీ...
రూ. 5 వేల సంస్థలకు.. రూ. 850 కోట్ల రుణాలట!
సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుజనా టవర్స్, సుజనా మెటల్స్.. అనే సంస్థలు సుజనాచౌదరిగా తెలిసిన వై.సత్యనారాయణచౌదరివి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లలో నమోదైన ఈ సంస్థలు ప్రధానంగా చేసే వ్యాపారం.. ఇనుము కొని అమ్మటం. అది కూడా రాష్ట్రంలోను, తమిళనాడులోనూ గల తమ గ్రూపు సంస్థలతోనే. ఆ సంస్థల వార్షిక నివేదికలు చూస్తే ఈ విషయం వెల్లడవుతుంది. సుజనా యూనివర్సల్కు వంద శాతం సబ్సిడరీ సంస్థగా 2007లో మారిషస్లో హెస్తియా హోల్డింగ్స్ లిమిటెడ్ అనే పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేశారు. హెస్తియాలో సుజనా యూనివర్సల్కు ఒకే ఒక్క వాటా ఉంది. ఆ వాటా ముఖ విలువ 100 అమెరికన్ డాలర్లు. అంటే.. ఇది మన కరెన్సీలో 5,200 రూపాయలకు సమానం. ఈ 100 డాలర్ల విలువైన సంస్థకు.. మూడు విదేశీ బ్యాంకులు మూడు కోట్ల డాలర్లు (సుమారు రూ.150 కోట్లు) రుణం ఇచ్చాయని చెప్తున్నారు. ఇందులో.. కోటి డాలర్ల రుణాన్ని మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (హెస్తియా), మరో రెండు కోట్ల డాలర్ల రుణాన్ని స్టాండర్డ్ బ్యాంక్ (సెలీనా), ఆఫ్రేసియా బ్యాంక్ (సెలీనా)లు అందించాయట. ఈ రుణానికి సుజనా యూనివర్సల్ కార్పొరేట్ గ్యారెంటీ ఇచ్చింది.
మాతృ సంస్థల ఖాతాలకు మళ్లింపు...
హెస్తియా హోల్డింగ్స్ 2011 మార్చి నాటికి రూ. 46.33 కోట్ల వ్యాపారం చేసిందని టర్నోవర్ నమోదు చేశారు. నిజానికి దేశీయంగా తమ కంపెనీలు నమోదు చేసిన టర్నోవరే ఉత్తుత్తిదని సుజనా సంస్థలు అధికారికంగా అంగీకరించాయి. అలాంటిది వారు విదేశాల్లో నెలకొల్పిన సంస్థలు స్వదేశంలోని వారి బోగస్ కంపెనీలతో ఏ వ్యాపారం చేస్తాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంటే.. విదేశాల్లోనూ బూటకపు టర్నోవర్ చూపారన్నది స్పష్టమవుతోంది. హెస్తియా నమోదు చేసిన రూ. 46 కోట్ల టర్నోవర్ చూసి.. విదేశీ బ్యాంకులు రూ. 150 కోట్లు రుణంగా ఇచ్చాయని సుజనా సంస్థలు చెప్తున్నాయి. ఇదే తరహాలో సుజనా యూనివర్సల్, సుజనా మెటల్స్ సంస్థలకు సబ్సిడరీ కంపెనీలుగా ఏర్పాటైన సుజనా హోల్డింగ్స్ (దుబాయ్), ఆల్ఫా వెంచర్స్ (కేమాన్ ఐలాండ్స్) కూడా విదేశీ బ్యాంకుల నుంచి రూ. 400 కోట్లు రుణం తీసుకున్నాయి. ఆ విదేశీ రుణానికి మాతృసంస్థలైన సుజనా యూనివర్సల్, సుజనా మెటల్స్ కార్పొరేట్ గ్యారెంటీ ఇచ్చాయి. ఆల్ఫా వెంచర్స్ సంస్థ మారిషస్ బ్యాంకు నుంచి మరో రూ. 300 కోట్లకు పైగా రుణం తీసుకుంది. ఈ రుణానికి సుజనా టవర్స్ కార్పొరేట్ గ్యారెంటీ ఇచ్చింది. మొత్తం కలిపితే.. దాదాపు రూ. 850 కోట్లకు పైగా సొమ్ము విదేశీ రుణం పేరుతో సుజనా సంస్థల సబ్సిడరీ కంపెనీల ఖాతాల్లో చేరింది. ఆ సొమ్ము.. అక్కడి నుంచి.. గ్రూపు సంస్థల మధ్య క్రయవిక్రయాల పేరుతో హైదరాబాద్లోని మాతృ సంస్థలకు వచ్చి చేరింది.
అది రుణమా? నల్లధనమా?
విదేశీ రుణాల పేరుతో అక్కడి సబ్సిడరీ సంస్థలకు.. అక్కడి నుంచి లావాదేవీల పేరుతో స్వదేశంలోని మాతృ సంస్థలకు వచ్చి చేరుతున్నది.. నల్లడబ్బు అని, అది క్రయవిక్రయాల రూపంలో రావటంతో తెల్లడబ్బుగా మారిపోయిందని ఇట్టే అర్ధమవుతుంది. ఎందుకంటే.. కేవలం వంద డాలర్ల ఈక్విటీ ఉన్న సంస్థకు.. ఏకంగా మూడు కోట్ల డాలర్ల రుణాలు జారీ చేసినపుడు.. మారిషస్ బ్యాంకులు కనీస నిబంధనలు కూడా పాటించిన దాఖలాలు లేవు. ఏదైనా సంస్థ తమ గ్రూపులోని ఇతర సంస్థలకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు పూచీకత్తు (కార్పొరేట్ గ్యారంటీ) ఇవ్వాలంటే.. ముందుగా వాటాదారుల అనుమతి తీసుకోవాలి. కంపెనీల చట్టం 1956 లోని సెక్షన్ 372ఎ ప్రకారం ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. బ్యాంకులు కూడా ఈ తీర్మానం ప్రతి ఆధారంగానే సదరు సంస్థకు రుణం ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయిస్తాయి. అయితే.. మారిషస్ బ్యాంకులు ఇలా వాటాదారుల అనుమతి సూచించే తీర్మానం లేకుండానే సుజనా సబ్సిడరీ సంస్థలకు దాదాపు రూ. 850 కోట్ల రుణాన్ని మంజూరు చేశాయట. మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (హెస్తియా), స్టాండర్డ్ బ్యాంక్ (సెలీనా), ఆఫ్రేసియా బ్యాంక్ (సెలీనా) నుంచి హెస్తియా హోల్డింగ్స్ రూ. 150 కోట్ల రుణం తీసుకోవటానికి కార్పొరేట్ గ్యారంటీ సుజనా యూనివర్సల్ ఇచ్చింది. కానీ ఆ సంస్థ ఈ గ్యారంటీకి సంబంధించి తన వాటాదారుల నుంచి ముందుగా అనుమతి తీసుకోలేదు. దానికి సంబంధించిన తీర్మానమూ చేయలేదు. రుణం మంజూరయిన తర్వాత సుజనా యూనివర్సల్ దానికి అనుమతి కోరుతూ వాటాదారుల తీర్మానం కోరటమే దీనికి సాక్ష్యం. సుజనా టవర్స్, సుజనా మెటల్స్ కూడా ఇలాగే వ్యవహరించాయి. అంటే.. ఆయా సంస్థల గ్యారెంటీకి సంబంధించి వాటాదారుల ముందస్తు అనుమతి, తీర్మానం లేకుండానే విదేశీ బ్యాంకులు రుణాలు ఇచ్చేశాయట!
ఆ బ్యాంకులూ బోగస్సేనా?
ఇదంతా చూస్తే.. అసలు వంద డాలర్లు, రెండు వందల డాలర్లు ఈక్విటీ గల సంస్థలకు.. ముందూ వెనుకా చూడకుండా కోట్లకు కోట్లు రుణాలిచ్చేసే బ్యాంకులు ఉన్నాయా అన్న అనుమానం కలగకమానదు. సదరు సంస్థలు చూపుతున్న టర్నోవర్ వాస్తవమైనదా కాదా అన్నది పరిశీలించుకోకుండానే.. చూపిన టర్నోవర్కూ మూడింతలు రుణాలు మంజూరు చేసే బ్యాంకులూ ఉంటాయా అన్న ఆశ్చర్యం కలగక మానదు. దీనినిబట్టి చూస్తే.. ఇక్కడ రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి.. సుజనా సంస్థలు చూపిన టర్నోవర్ లాగానే.. అవి చెప్తున్న విదేశీ బ్యాంకులు కూడా బోగస్వై ఉండాలి. అంటే.. లేని బ్యాంకులు ఉన్నట్లుగా చూపి.. ఆ బ్యాంకులు ఇవ్వని రుణాన్ని ఇచ్చినట్లుగా చూపి.. నల్లధనాన్ని రుణం పేరుతో చెలామణిలోకి తెచ్చుండాలి. లేదంటే.. ఒకవేళ అలాంటి బ్యాంకులంటూ ఉంటే.. అవికూడా నల్లడబ్బు లావాదేవీలకు, దళారీతనానికి కేరాఫ్ అడ్రస్లై ఉండాలి. నల్లధనానికి అడ్డాలైన కేమాన్ ఐలాండ్స్, వర్జిన్ ఐలాండ్స్లలోని బ్యాంకుల్లో నల్లధనం దాచి.. ఆ బ్యాంకులతో కుమ్మక్కై.. ఆ నల్లధనాన్నే తమ సంస్థలకు రుణం రూపంలో తెచ్చుకుంటూ ఉండాలి. ఈ రెండు రకాలుగా కాకుండా.. సుజనా బోగస్ సంస్థలకు అన్ని వందల కోట్ల రూపాయలు రుణం లభించే అవకాశమే లేదు. ప్రస్తుతం ‘సాక్షి’ దృష్టికి వచ్చిన ఉదంతంలో రూ. 850 కోట్లు ఇలా విదేశాల నుంచి సుజనా సంస్థల్లోకి ప్రవహించినట్లు వెల్లడైంది. అయితే.. ఇలాంటి ‘నల్ల’కోణాలు మరిన్ని ఉన్నాయని.. వేల కోట్ల రూపాయలు ఈ మార్గం ద్వారా సుజనా సంస్థల్లోకి ప్రవహిస్తోందని సమాచారం. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ దృష్టి సారించి, లోతుగా దర్యాప్తు చేస్తే కానీ.. ఎన్ని వేల కోట్ల నల్లధనానికి ఇలా తెలుపు రంగు వేసుకుని తెచ్చారన్నది తేటతెల్లంకాదు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, సుజనాచౌదరిల మధ్య గల బంధం ఎలాంటిదో.. హెరిటేజ్ ఫుడ్స్ వాటాదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆ సంస్థ ఆస్తులను ఏ విధంగా కాజేశారో.. గతంలోనే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్కు అనుబంధ సంస్థగా హెరిటేజ్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనే సబ్సిడరీ కంపెనీని సృష్టించారు. హైదరాబాద్లోని కొండాపూర్లో హెరిటేజ్ ఫుడ్స్కు ఉన్న విలువైన 3.42 ఎకరాల భూమిని కేవలం రూ.2.73 కోట్లకు హెరిటేజ్ ఇన్ఫ్రాకు బదలాయించారు. ఈ వ్యవహారం జరిగే రోజుల్లో అంటే 2005 ప్రాంతాల్లో కొండాపూర్లో ఎకరా భూమి విలువ రూ.12 కోట్లు పైమాటే. అయితే హెరిటేజ్ ఇన్ఫ్రాలో చంద్రబాబు భార్య భువనేశ్వరికి 49 శాతం వాటా ఉంది. అందుకే కారుచౌకగా హెరిటేజ్ భూమిని ఇన్ఫ్రాకు బదలాయించారు. ఇక సుజనాచౌదరికి చెందిన శ్రీచక్ర మర్కండైజింగ్ లిమిటెడ్ పెద్దగా కార్యకలాపాలు లేని సంస్థ. తమిళనాడులో రూ.600 అద్దె దుకాణమే దీని కార్యాలయం. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆర్థిక రుణాల సంస్థ సికామ్ లిమిటెడ్ దగ్గర సుజనా రూ.60 కోట్లు అప్పు తీసుకుంది. దీనికి హామీగా హెరిటేజ్ ఇన్ఫ్రా తన దగ్గరున్న 3.47 ఎకారాలను హామీగా పెట్టింది. అంటే.. హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన భూమిని.. సుజనా సంస్థల కోసం.. చంద్రబాబు తన సతీమణి ద్వారా తాకట్టుపెట్టించారన్న మాట. భూమి విలువ కూడా హెరిటేజ్ ఇన్ఫ్రా ఖాతాల్లో ఉన్నంత వరకు రూ.2.73 కోట్లుగా పేర్కొని, రుణ సంస్థ సికామ్ లిమిటెడ్ వద్ద తాకట్టు పెట్టినపుడు భూమి విలువను రూ. 85 కోట్లుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారం తర్వాతే సుజనాచౌదరికి చంద్రబాబు రాజ్యసభ సభ్యత్వాన్ని కానుకగా ఇచ్చారు. అంటే.. ఆ 60 కోట్లు ఎక్కడికి చేరాయో.. సుజనాచౌదరికి రాజ్యసభ సభ్యత్వం ఏ సేవకు ప్రతిఫలమో అర్థం చేసుకోవచ్చు!
మా టర్నోవర్ అంతా బూటకమే | |||||||||||||||||||||||||||
వాణిజ్య పన్నుల శాఖ ఎదుట సుజనా గ్రూపు అంగీకారం | |||||||||||||||||||||||||||
|
0 comments:
Post a Comment