పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు వైఎస్ జగన్

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు వైఎస్ జగన్

Written By news on Monday, December 19, 2011 | 12/19/2011

కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. ఆయన ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నెల 21 వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉంటారు.

పీఆర్పీ విప్ వర్తించదు: శోభా నాగిరెడ్డి
హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీయే లేనప్పుడు ఆపార్టీ జారీ చేసిన విప్ తనకు ఎలా వర్తిస్తుందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. పీఆర్పీ ఇచ్చిన అనర్హత పిటిషన్ పై ఆమె సోమవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కలిసి వివరణ ఇచ్చారు. అనంతరం శోభానాగిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ పీఆర్పీకి విప్ ఇచ్చే నైతిక హక్కు లేదని, ఇంకా తాను విప్ ధిక్కరించటం ఎలా అవుతుందన్నారు.

వారం రోజుల్లోగా అనర్హత పిటిషన్ పై వివరణ ఇవ్వాలని స్పీకర్ కోరినట్లు శోభా నాగిరెడ్డి తెలిపారు. పీఆర్పీయే లేనప్పుడు తాను ఎవరికి వివరణ ఇవ్వాలని ఆమె ప్రశ్నించారు. తాను మొదటి నుంచి పీఆర్పీ విలీనానికి వ్యతిరేకమని ఆమె అన్నారు. ఉప ఎన్నికలకు తాము భయపడేది లేదని, అన్నింటికి సిద్ధపడే ముందుకు వచ్చామని శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు.
Share this article :

0 comments: