ఉత్తరప్రదేశ్, మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఓబీసీ కోటాలో మైనార్టీలకు నాలుగున్నర శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హెచ్ఏ రెహమాన్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ‘2004లో ఏర్పాటు చేసిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్టు ఆధారంగా విద్యా, ఉపాధి రంగాల్లో మైనార్టీలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. అందులో ప్రత్యేకించి ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. కానీ ఇప్పుడు కేంద్రం ముస్లింలకు కల్పించనున్న నాలుగున్నర శాతం రిజర్వేషన్ల వలన జాతీయ స్థాయిలో ముస్లింలకు కేవలం ఒకటిన్నర శాతం కూడా లబ్ధి చేకూరకపోవచ్చు’ అని పేర్కొన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు ‘నేనున్నానంటూ’ దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. వైఎస్కు ముస్లింలు జీవితాంతం రుణపడి ఉంటారని పేర్కొన్నారు.
Home »
» ఎన్నికల కోసమే మైనార్టీ రిజర్వేషన్లు
ఎన్నికల కోసమే మైనార్టీ రిజర్వేషన్లు
Written By ysrcongress on Sunday, December 25, 2011 | 12/25/2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment