వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రాక సందర్భంగా రాయచోటి జనంతో నిండిపోయింది. బస్టాండ్ సెంటర్లో జనం కిక్కిరిసిపోయారు. ఓదార్పు యాత్రలో భాగంగా రాత్రి 11 గంటలకు జగన్ రాయచోటి చేరుకున్నారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన జనం ఆయనకు ఘనస్వాగతం పలికారు. బస్టాండ్ సెంటర్లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి జగన్ వెంట ఉన్నారు.
అర్ధరాత్రి సమయం అయినా రాయచోటిలో తనకోసం వేచి ఉన్న జనాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చలించిపోయారు. నిద్ర కూడా మానుకొని రాయచోటి ప్రజలు చూపుతున్న అభిమానం మరువలేనిదన్నారు. రాత్రి 11.40 గంటలకు ఆయన నేతాజీ క్లబ్ వద్దకు చేరుకున్నారు. కిక్కిరిసిన జనం మధ్యలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు.
అర్ధరాత్రి సమయం అయినా రాయచోటిలో తనకోసం వేచి ఉన్న జనాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చలించిపోయారు. నిద్ర కూడా మానుకొని రాయచోటి ప్రజలు చూపుతున్న అభిమానం మరువలేనిదన్నారు. రాత్రి 11.40 గంటలకు ఆయన నేతాజీ క్లబ్ వద్దకు చేరుకున్నారు. కిక్కిరిసిన జనం మధ్యలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు.
0 comments:
Post a Comment