పార్టీ నిర్వహణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పలు బాధ్యతలను కేటాయించారు. మూడు జిల్లాల్లో పార్టీ అడ్హాక్ కమిటీలకు కొత్త కన్వీనర్లను జగన్ నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్టణం కన్వీనర్గా ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, విశాఖపట్టణం అర్బన్ కన్వీనర్గా వంశీకృష్ణ, ఖమ్మం జిల్లా కన్వీనర్గా సీనియర్ నాయకుడు చందా లింగయ్యను నియమితులయ్యారు. కో ఆర్డినేటర్లుగా యల్లసిరి గోపాల్ రెడ్డి(కడప-కర్నూలు), వై.విశ్వేశ్వరరెడ్డి(అనంతపురం-నెల్లూరు), శివకుమార్(కరీంనగర్, ఆదిలాబాద్), బండారు మోహన్ రెడ్డి(నల్లగొండ-మహబూబ్నగర్) ఆయా జిల్లాలకు పరిశీలకులుగా మేకా శేషుబాబు(నెల్లూరు), బాలమణెమ్మ (నల్లగొండ), గౌతంరెడ్డి (కర్నూలు), రవిరాజ్ (విజయనగరం), వై.వెంకటేశ్వరరావు (విజయవాడ సిటీ), పుల్లా భాస్కర్ (కరీంనగర్) బాధ్యతలను అప్పగించారు.
Home »
» వైఎస్సార్ కాంగ్రెస్ బాధ్యతల కేటాయింపు
వైఎస్సార్ కాంగ్రెస్ బాధ్యతల కేటాయింపు
Written By ysrcongress on Saturday, December 31, 2011 | 12/31/2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment