త్వరలోనే తెలంగాణలో ఓదార్పు యాత్ర: గట్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » త్వరలోనే తెలంగాణలో ఓదార్పు యాత్ర: గట్టు

త్వరలోనే తెలంగాణలో ఓదార్పు యాత్ర: గట్టు

Written By ysrcongress on Friday, December 16, 2011 | 12/16/2011


మంకమ్మతోట (కరీంనగర్), న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారని ఆ పార్టీ బీసీ విభాగం రాష్ర్ట కన్వీనర్ గట్టు రామచంద్రారావు తెలిపారు. కరీంనగర్‌లో గురువారం ఆయ న మాట్లాడుతూ తెలంగాణలో చేపట్టే ఓదార్పు యాత్రకు సీమాంధ్రలో కంటే ఎక్కువ ప్రజాదరణ లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. తెలంగాణలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. వైఎస్‌ఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారని తెలిపారు. జగన్ సీఎం అయితే పుట్టగతులు ఉండవనే భయంతోనే కాంగ్రెస్.. సీబీఐతో దాడులు చేయిస్తోందని విమర్శించారు. కేంద్రంలో పదవి ఇస్తామని సోనియా చెప్పినా.. మాట, విలువలకు కట్టుబడి జగన్ వెనక్కి తగ్గలేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన టీడీపీ.. కాంగ్రెస్‌తో మిలాఖత్ అయిందని, ప్రభుత్వం ఓడిపోదని తెలిసిన తర్వాతనే బాబు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. ఎంతమంది విశ్వాస ఘాతకులున్నా ప్రజల పక్షాన మేమున్నామన్నామంటూ వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు అవిశ్వా సానికి అనుకూలంగా ఓటు వేశారన్నారు.
Share this article :

0 comments: