కేశలింగాయపల్లి: రైతు సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ విమర్శించారు. అన్నదాతకు భరోసా ఇవ్వని ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినా తప్పులేదని అన్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం కేశలింగాయపల్లిలో శనివారం మధ్యాహ్నం ఆయన ఉల్లి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో, లేదో అర్థంకాని పరిస్థితిలో రైతు ఉన్నాడని అన్నారు. పది నెలలుగా వ్యవసాయ శాఖకు మంత్రే లేరని, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్ఛాన్సలర్ను నియమించలేని దుస్థితిలో ప్రభుత్వముందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Home »
» అన్నదాతను ఆదుకోండి: జగన్ డిమాండ్
అన్నదాతను ఆదుకోండి: జగన్ డిమాండ్
Written By ysrcongress on Saturday, December 24, 2011 | 12/24/2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment