కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం ఘనంగా జరుపుకుంటున్నారు. వేడుకలే కాకుండా పలు రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. యూసుఫ్గూడ చెక్పోస్ట్ సమీపంలోని మెహమూద్ ఫంక్షన్హాల్లో ఏర్పాటైన శిబిరాన్ని వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలు ప్రారంభించారు. వైఎస్ఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ మెగా వైద్య శిబిరంలో 75 మంది డాక్టర్లు, 100కుపైగా నర్సులు సేవలు అందిస్తున్నారు. 500కుపైగా వలంటీర్లు పనిచేస్తున్నారు.
ఈ సందర్భంగా శోభానాగిరెడ్డి తమ నేత బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్దనరెడ్డి, పార్టీ నేత రాజ్ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. 10 వేల మందికి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సేవాదళ్ అధ్యక్షుడు డాక్టర్ కోటంరెడ్డి వినయ్రెడ్డి తెలిపారు. భోజన వసతి కల్పించామన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని శోభా నాగిరెడ్డి అన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన విభాగం ఆద్వర్యంలో వైఎస్ రక్తదానశిబిరం నిర్వహిస్తున్నారు.
కడపలో వైఎస్ జగన్ బర్తడే వేడుకలు ఘనంగా జరిగాయి. కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కేక్ కట్ చేశారు. అలాగే అనంతపురంలో వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ౩కే రన్ నిర్వహించారు. కాగా వేంపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు వైఎస్ విజయమ్మ కేక్ కట్ చేసి దుస్తులు పంపిణీ చేశారు.
అటు గుంటూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. తిరుపతిలోనూ వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తుమ్మలకుంటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్కట్చేసి పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారు.
గుంటూరు జిల్లాలోని ఏటుకూరు గ్రామంలోని పంట పొలాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జన్మదిన వేడుకలు రైతులు జరుపుకున్నారు. ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లాగే జగన్ తమ సమస్యలపై స్పందిస్తున్నారని రైతులు అన్నారు. రైతు సమస్యలపై పోరాడుతున్న జననేత జగన్ జన్మదిన వేడుకలు పోలాలలో జరుపుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని వారు చెప్పారు. పొలాల మధ్యే కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు.
వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన మేకపాటి
న్యూఢిల్లీ : కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పలువురు నేతలు బుధవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల కోసం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయనను ఈరోజు ఉదయం ఎంపీలు మేకపాటి, మాజీ ఎంపీ బాలశౌరీలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ఢిల్లీలోని జగన్ నివాసానికి వచ్చి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. యూసుఫ్గూడ చెక్పోస్ట్ సమీపంలోని మెహమూద్ ఫంక్షన్హాల్లో ఏర్పాటైన శిబిరాన్ని వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలు ప్రారంభించారు. వైఎస్ఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ మెగా వైద్య శిబిరంలో 75 మంది డాక్టర్లు, 100కుపైగా నర్సులు సేవలు అందిస్తున్నారు. 500కుపైగా వలంటీర్లు పనిచేస్తున్నారు.
ఈ సందర్భంగా శోభానాగిరెడ్డి తమ నేత బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్దనరెడ్డి, పార్టీ నేత రాజ్ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. 10 వేల మందికి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సేవాదళ్ అధ్యక్షుడు డాక్టర్ కోటంరెడ్డి వినయ్రెడ్డి తెలిపారు. భోజన వసతి కల్పించామన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని శోభా నాగిరెడ్డి అన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన విభాగం ఆద్వర్యంలో వైఎస్ రక్తదానశిబిరం నిర్వహిస్తున్నారు.
కడపలో వైఎస్ జగన్ బర్తడే వేడుకలు ఘనంగా జరిగాయి. కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కేక్ కట్ చేశారు. అలాగే అనంతపురంలో వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ౩కే రన్ నిర్వహించారు. కాగా వేంపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు వైఎస్ విజయమ్మ కేక్ కట్ చేసి దుస్తులు పంపిణీ చేశారు.
అటు గుంటూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. తిరుపతిలోనూ వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తుమ్మలకుంటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్కట్చేసి పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారు.
గుంటూరు జిల్లాలోని ఏటుకూరు గ్రామంలోని పంట పొలాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జన్మదిన వేడుకలు రైతులు జరుపుకున్నారు. ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లాగే జగన్ తమ సమస్యలపై స్పందిస్తున్నారని రైతులు అన్నారు. రైతు సమస్యలపై పోరాడుతున్న జననేత జగన్ జన్మదిన వేడుకలు పోలాలలో జరుపుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని వారు చెప్పారు. పొలాల మధ్యే కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు.
వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన మేకపాటి
న్యూఢిల్లీ : కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పలువురు నేతలు బుధవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల కోసం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయనను ఈరోజు ఉదయం ఎంపీలు మేకపాటి, మాజీ ఎంపీ బాలశౌరీలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ఢిల్లీలోని జగన్ నివాసానికి వచ్చి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
0 comments:
Post a Comment