మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప లక్ష్యంతో ప్రారంభించాలనుకున్న రచ్చబండని రచ్చరచ్చ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. నంబూరు శివాలయం సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం వైఎస్ తాపత్రయపడ్డారన్నారు. వైఎస్ మరణం తరువాత సంక్షేమ పథకాలన్నీ కుంటుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు ఈ ప్రభుత్వం ఎన్నో నిబంధనలు పెడుతుందన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా తగ్గించాలా అని చూస్తున్నారన్నారు. పేదవాడి ఆరోగ్యంతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్నారు.
పదవులు పోతాయని తెలిసినా తమ ఎమ్మెల్యేలు మాటకు కట్టుబడి శాసనసభలో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారని ఆయన తెలిపారు. వారిని అనర్హులుగా ప్రకటిస్తే, వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఉప ఎన్నికలంటూ వస్తే, రాష్ట్ర రైతుల కోసం తొలిసారిగా జరిగే ఉప ఎన్నికలు అవుతాయన్నారు.
పెద్దకాకాని రెడ్డిగారి బావి వద్ద మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జగన్ ని చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు.
పదవులు పోతాయని తెలిసినా తమ ఎమ్మెల్యేలు మాటకు కట్టుబడి శాసనసభలో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారని ఆయన తెలిపారు. వారిని అనర్హులుగా ప్రకటిస్తే, వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఉప ఎన్నికలంటూ వస్తే, రాష్ట్ర రైతుల కోసం తొలిసారిగా జరిగే ఉప ఎన్నికలు అవుతాయన్నారు.
పెద్దకాకాని రెడ్డిగారి బావి వద్ద మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జగన్ ని చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు.
0 comments:
Post a Comment