‘ఉప’ పోరులో రైతన్నే గెలుస్తాడు: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ఉప’ పోరులో రైతన్నే గెలుస్తాడు: జగన్

‘ఉప’ పోరులో రైతన్నే గెలుస్తాడు: జగన్

Written By ysrcongress on Wednesday, December 28, 2011 | 12/28/2011


  త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో రైతన్నే గెలుస్తాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను గెలిపించి ప్రభుత్వం కళ్లు తెరిపించాలన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఓదార్పుయాత్ర చేస్తున్న జగన్ బుధవారం మధ్యాహ్నం చాగలగుట్టపల్లెలో మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలో రానున్న ఉప ఎన్నికల్లో రైతు- రైతుకూలీ ఒకవైపుంటే, కుళ్లు రాజకీయ వ్యవస్థ మరోవైపు ఉంటుందని అన్నారు. అధికార పార్టీ ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నించవచ్చన్నారు. రాష్ట్రంలో రైతు పడుతున్న బాధలు ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యేలా వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించాలని జగన్ కోరారు.


 

 వైఎస్‌ఆర్ జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా నరసింహరాజు పల్లెలో నరసింహరాజు కుటుంబాన్ని వైస్ జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఎర్రమరెడ్డి పల్లె నుంచి మూడో రోజు యాత్రను ప్రారంభించిన జగన్ నేరుగా నరసింహరాజు పల్లెకు వచ్చారు. నరసింహరాజు కుటుంబ సభ్యుల్ని పేరుపేరునా పలకరించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. దాదాపు అరగంట సేపు నరసింహరాజు ఇంట్లో జగన్ గడిపారు.

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే నరసింహరాజుకు విపరీతమైన అభిమానం. వైఎస్‌ఆర్ ఇక లేరన్న సమాచారం తెలియగానే గుండె పగిలి చనిపోయారు. నరసింహరాజుకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులున్నారు. ఇంటి పెద్ద దిక్కు కనుమూయడంతో ఆ కుటుంబ పరిస్థితి దీనంగా మారింది.
Share this article :

0 comments: