దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని అభిమానించే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు తన క్యాంపు కార్యాలయంలో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా తాజా రాజకీయ పరిస్థితిపై చర్చిస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంలాంటి అంశాలతో పాటు ఫీజుల చెల్లింపు పథకం, 104, 108, ఆరోగ్యశ్రీ లాంటి సంక్షే మ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్న వైనం తదితర అంశాలు కూడా సమావేశం ఎజెండాలో ఉన్నాయి.
రైతుల సమస్యలపై ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు చేయాలని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది. ఫీజుల చెల్లింపు పథకాన్ని నీరు గారుస్తున్నందుకు నిరసనగా జనవరి 4న ఆందోళన చేయాలని కూడా ఈ నెల 17న పార్టీ కేంద్ర పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. ఈ రెండు కార్యక్రమాల నిర్వహణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. ఈ భేటీలో వైఎస్సార్ కాంగ్రెస్ను సమర్థిస్తున్న ఎంపీలూ పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి జగన్ బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.
రైతుల సమస్యలపై ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు చేయాలని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది. ఫీజుల చెల్లింపు పథకాన్ని నీరు గారుస్తున్నందుకు నిరసనగా జనవరి 4న ఆందోళన చేయాలని కూడా ఈ నెల 17న పార్టీ కేంద్ర పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. ఈ రెండు కార్యక్రమాల నిర్వహణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. ఈ భేటీలో వైఎస్సార్ కాంగ్రెస్ను సమర్థిస్తున్న ఎంపీలూ పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి జగన్ బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.
0 comments:
Post a Comment