పవార్ తో జగన్ భేటీ వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పవార్ తో జగన్ భేటీ వాయిదా

పవార్ తో జగన్ భేటీ వాయిదా

Written By ysrcongress on Wednesday, December 21, 2011 | 12/21/2011

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి భేటీ అనివార్య పరిస్థితులలో వాయిదా పడింది. ఆహారభద్రతపై ఈరోజు రాజ్యసభలో చర్చ జరుగనుంది. ఈ కారణంగా మంత్రి పవార్ రాజ్యసభకు అందుబాటులో ఉండవలసిన అవసరం ఏర్పడింది. దాంతో రాష్ట్ర రైతుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేద్దామనుకున్న సమావేశాన్ని వాయిదా వేశారు. 

జగన్ నిన్న మంత్రి పవార్ ని కలిసి రాష్ట్రంలోని రైతుల సమస్యలు వివరించి, వాటిని పరిష్కరించాలని కోరిన విషయం తెలిసిందే. అందుకు మంత్రి వెంటనే స్పందించి సమస్యల పరిష్కారం కోసం సంబంధిత మంత్రి, అధికారులతో ఈరోజు సాయంత్రమే ఒక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సమావేశాని జగన్ ని కూడా హాజరు కావలసిందిగా మంత్రి కోరారు. ఈ సమావేశంలో పాల్గొనే నిమిత్తం జగన్ తన తిరుగు ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. అనుకోని పరిస్థితులలో ఈ సమావేశం వాయిదా పడింది.
Share this article :

0 comments: