జగన్ పర్యటన కోసం తెలంగాణ ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. జనవరి 4, 2012 తేదిన చేపట్టనున్న ఫీజు ధర్నాకు సంబంధించిన పోస్టర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఎంపీ మేకపాటి, కొణతాల రామకృష్ణ, పుత్తా ప్రతాప్రెడ్డిలు విడుదల చేశారు. గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర పూర్తి కాగానే, తెలంగాణలో ప్రాంతంలో ఓదార్పుయాత్రను చేపట్టనున్నారని ఆయన తెలిపారు.
ఫీజు రీఎంబర్స్మెంట్ పథకానికి సంబంధించి మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే.. కేవలం 500 కోట్ల రుపాయలు మాత్రమే ఇచ్చారన్నారు. డిసెంబర్ నెల ముగిసే సమయానికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి చెప్పారని, ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో తెలియచేయాలని మేకపాటి అన్నారు. మరో రెండు రోజుల్లో డిసెంబర్ నెల పూర్తి అవుతుందని ఆయన గుర్తు చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలపై సమీక్ష చేపట్టినట్టు మేకపాటి మీడియాకు వెల్లడించారు.
ఫీజు రీఎంబర్స్మెంట్ పథకానికి సంబంధించి మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే.. కేవలం 500 కోట్ల రుపాయలు మాత్రమే ఇచ్చారన్నారు. డిసెంబర్ నెల ముగిసే సమయానికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి చెప్పారని, ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో తెలియచేయాలని మేకపాటి అన్నారు. మరో రెండు రోజుల్లో డిసెంబర్ నెల పూర్తి అవుతుందని ఆయన గుర్తు చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలపై సమీక్ష చేపట్టినట్టు మేకపాటి మీడియాకు వెల్లడించారు.
0 comments:
Post a Comment