వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం, ప్రతిపక్షం భయపడుతోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం, ప్రతిపక్షం భయపడుతోంది

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం, ప్రతిపక్షం భయపడుతోంది

Written By ysrcongress on Sunday, December 4, 2011 | 12/04/2011

కాంగ్రెస్, టీడీపీలు పోటాపోటీగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయని ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. ఆదివారం వైఎస్ జగన్ తో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ పరిణామాలన్నీ జగన్ కు మరింత మంచి చేసేవేనన్నారు. రాజకీయ నేతలతో పాటు ఓ వర్గం మీడియా కూడా జగన్ పై కట్టుకథలు అల్లడం దురదృష్టకరమన్నారు.

తమ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అనేది అసెంబ్లీలో చేతులెత్తినప్పుడు తెలుస్తుందని శోభా నాగిరెడ్డి అన్నారు. జగన్ వర్గ ఎమ్మెల్యేలు డీలా పడ్డారని ఓ పథకం ప్రకారం జరుగుతున్న కుట్ర అని, కొన్ని ఛానెళ్లు దుష్ర్షచారం చేయటం తగదన్నారు. ఈ కుట్రలు చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం, ప్రతిపక్షం ఎంత భయపడుతోంది అర్థం అవుతుందన్నారు.

ఈ రోజు సాయంత్రం జగన్ బెంగళూరుకు వెళతారని కొన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేయటం కుట్రలో భాగమేనని శోభా నాగిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్ కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను అధికార పార్టీ ప్రలోభాలతో పాటు, ఒత్తిడికి గురి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా తాము జగన్ వెంటే నడుస్తామని ఆమె స్పష్టం చేశారు. టీడీఎల్పీ, సీఎల్పీ సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరు కాకపోతే ప్రశ్నించని మీడియా .....జగన్ వద్దకు ఎవరైనా ఎమ్మెల్యే వ్యక్తిగత కారణాలతో రాకుంటే ఎందుకంత హడావుడి చేస్తారని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు.
Share this article :

0 comments: