రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మకమైన నేతగా ప్రజల పక్షాన నిలుస్తారని మాజీ మంత్రి బోడ జనార్ధన్ అన్నారు. జగన్ నాయకత్వ లక్షణాలకు ఆకర్షితుడనై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఆయన అన్నారు. జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు బోడ జనార్ధన్ పులివెందులకు చేరుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో గట్టి పట్టున్న నేతగా బోడ జనార్ధన్కు మంచి పేరుంది. తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కొద్ది రోజుల క్రితం ఆయన ప్రకటించారు.
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కనుమరుగుకావడం ఖాయమని మాజీ మంత్రి బోడ జనార్ధన్ జోస్యం చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జనార్ధన్ పులివెందులకు చేరుకుని, అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని తెలంగాణ ప్రాంత వాసులు ఎప్పటికి గుండెల్లో ఉంచుకుంటారని.. చిరకాలం గుర్తుంచుకుంటారని అని అన్నారు. జగన్ నాయకత్వాన్ని చూసి తెలంగాణ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్వార్ధపరుడని బోడ ఆరోపించారు.
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కనుమరుగుకావడం ఖాయమని మాజీ మంత్రి బోడ జనార్ధన్ జోస్యం చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జనార్ధన్ పులివెందులకు చేరుకుని, అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని తెలంగాణ ప్రాంత వాసులు ఎప్పటికి గుండెల్లో ఉంచుకుంటారని.. చిరకాలం గుర్తుంచుకుంటారని అని అన్నారు. జగన్ నాయకత్వాన్ని చూసి తెలంగాణ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్వార్ధపరుడని బోడ ఆరోపించారు.
0 comments:
Post a Comment