ఇక నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా అన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గురువారం జగన్ సమావేశమయ్యారు. భేటీ ముగిసిన తర్వాత పిల్లి సుభాష్చంద్రబోస్ విలేకరులతో మాట్లాడుతూ ఉప ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. అన్నిస్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల కోసమే అసెంబ్లీలో అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశామని చెప్పారు. వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినపుడు స్పీకర్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు కాబట్టి నోటీసులు, వివరణలంటూ కాలయాపన చేయొద్దని విజ్ఞప్తిచేశారు. ఇతర రాష్ట్రాల ఎన్నికలతో పాటు మార్చిలో ఉప ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. విడతలవారీగా ఎన్నికలు నిర్వహించాలనుకోవడం కుట్రపూరితమన్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు గెలుస్తారని సుభాష్చంద్రబోస్ ధీమా వ్యక్తం చేశారు. |
Home »
» ఏ ఎన్నికలు వచ్చినా పోటీ: వైఎస్సార్ సీపీ
ఏ ఎన్నికలు వచ్చినా పోటీ: వైఎస్సార్ సీపీ
Written By ysrcongress on Thursday, December 22, 2011 | 12/22/2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment