*కోతకొచ్చిన వరి కోయాలంటేనే రైతు భయపడుతున్నాడు
*గిట్టుబాటు లేని పంటనమ్మి అప్పులెలా కట్టాలని కన్నీళ్లు పెడుతున్నాడు
* పొద్దు పొడవక ముందే పనికి పోయినా రైతు కూలీలకు రూ.100 గిట్టట్లేదు
* వారి కోసం అవిశ్వాసం పెట్టిన చంద్రబాబు ఆ విషయంపై మాట్లాడింది గోరంత
* మహానేతను అప్రదిష్టపాలు చేయడానికి మాట్లాడింది కొండంత
*మా ఎమ్మెల్యేలు రైతన్నకోసం పదవుల త్యాగానికీ సిద్ధపడ్డారు
ఓదార్పు యాత్ర నుంచి న్యూస్లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇవాళ బస్తా వరి ధాన్యానికి రూ.720 మించి పలకడం లేదు.. కోతకొచ్చిన వరిని కోయాలంటేనే రైతన్నలు భయపడిపోతున్నారు. రూ.720కు వడ్లు అమ్ముకొని అప్పులెలా కట్టాలి? పిల్లలను ఎట్టా చదివించుకోవాలి దేవుడా! అని రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నారు? ఒక్క వరి రైతులే కాదు.. పొగాకు.. చెరుకు.. పసుపు.. పత్తి... ప్రతి రైతుదీ ఇదే దారుణమైన పరిస్థితి. సాగు చేసిన రైతులకు కష్టాలు, నష్టాలు, అప్పులే మిగులుతున్నాయి. చావే దిక్కవుతోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
అక్కా చెల్లెమ్మలు సూర్యుడు లేవక ముందే లేచి పొలానికి పోయి రాత్రి 7 గంటల వరకు నడుములు విరిగేలా పనిచేసినా రూ.100 కూడా కూలీ గిట్టని అధ్వాన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. గుంటూరు జిల్లా ఓదార్పుయాత్ర 37వ రోజు శుక్రవారం ఆయన చేబ్రోలు మండలంలోని పల్లెల్లో పర్యటించారు. 12 వైఎస్సార్ విగ్రహాలు ఆవిష్కరించారు.
పలు గ్రామాల్లో ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
రైతుల గురించి బాబు మాట్లాడింది ఇంత..: అసెంబ్లీ జరిగితే చంద్రబాబు నాయుడుగారు రైతుల కోసం అవిశ్వాసం పెడతానని గొప్పగా చెప్పారు. మొన్ననే అసెంబ్లీ జరిగింది. ఆశగా అందరం చూశాం. అవిశ్వాసం పెట్టడానికి ముందు ఆయన ఏం మాట్లాడుతారో? అని నిద్రాహారాలు మానుకొని అందరం టీవీల ముందు కూర్చొని అర్ధరాత్రి వరకు చూశాం. తీరా చూస్తే ఆయన రైతుల గురించి మాట్లాడింది.. ఇంత(వేలుతో అంగుళం చూపిస్తూ)! దివంగత నేత వైఎస్సార్ను అప్రదిష్టపాలు చేయడానికి మాట్లాడింది ఇంత(చేతులు బారుగా చాచి)! చంద్రబాబు గారి నైజమే అటువంటిది. ఆయన ఎప్పుడూ కూడా రాజకీయాలే ఆలోచన చేస్తారు. ఏ పని చేసినా దానివల్ల నాకేంటి లాభం అనే ఆలోచనతోనే ఆయన రాజకీయాలు ముందుకు పోతాయి. సొంత కూతురును ఇచ్చిన మామ ఎన్టీ రామారావునే పదవుల కోసం.. అధికారం కోసం వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు గారి గురించి అంతకంటే ఎక్కువ ఆలోచన చేయలేం.
తులసి మొక్కల్లా పెరుగుదాం అని చెప్పా..: చంద్రబాబు గారు ఏ ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టినా కూడా.. నేనైతే ఇక్కడి నుంచి(గుంటూరు) వెళ్లేటపుడే చెప్పి పోయా. జరుగుతున్నది అవిశ్వాస తీర్మానం. నాకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతు తెలిపితే డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై అయితే ఉప ఎన్నికలు జరగుతాయి. ఇవి అన్నీ తెలిసి కూడా నాకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లా.. వాళ్లను పిలిపించుకొని మాట్లాడా! ప్రతి ఒక్కరికీ ఒక విషయం చెప్పా. ‘మనం ప్రజల్లో ఉన్నాం.. ప్రజలు మనలను చూస్తున్నారు. విలువలు, విశ్వసనీయత లేని ఈ రాజకీయ వ్యవస్థలో ఒక తులసి మొక్కలా మనం పెరగాలి’ అని చెప్పా. ఇవాళ రైతన్న పరిస్థితి దారుణంగా ఉంది. రైతు కూలీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వీళ్ల కోసం మనం తోడుగా నిలబడలేకపోతేమటుకు ఈ రాజకీయ వ్యవస్థ ఉండటమే దండగ అని చెప్పా. నేను చెప్పిన ప్రతి మాటను కూడా ఎమ్మెల్యేలు గౌరవించారు. పదవులు పోతాయని తెలిసి కూడా... రైతన్నలకు తోడుగా, అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు.
*గిట్టుబాటు లేని పంటనమ్మి అప్పులెలా కట్టాలని కన్నీళ్లు పెడుతున్నాడు
* పొద్దు పొడవక ముందే పనికి పోయినా రైతు కూలీలకు రూ.100 గిట్టట్లేదు
* వారి కోసం అవిశ్వాసం పెట్టిన చంద్రబాబు ఆ విషయంపై మాట్లాడింది గోరంత
* మహానేతను అప్రదిష్టపాలు చేయడానికి మాట్లాడింది కొండంత
*మా ఎమ్మెల్యేలు రైతన్నకోసం పదవుల త్యాగానికీ సిద్ధపడ్డారు
ఓదార్పు యాత్ర నుంచి న్యూస్లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇవాళ బస్తా వరి ధాన్యానికి రూ.720 మించి పలకడం లేదు.. కోతకొచ్చిన వరిని కోయాలంటేనే రైతన్నలు భయపడిపోతున్నారు. రూ.720కు వడ్లు అమ్ముకొని అప్పులెలా కట్టాలి? పిల్లలను ఎట్టా చదివించుకోవాలి దేవుడా! అని రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నారు? ఒక్క వరి రైతులే కాదు.. పొగాకు.. చెరుకు.. పసుపు.. పత్తి... ప్రతి రైతుదీ ఇదే దారుణమైన పరిస్థితి. సాగు చేసిన రైతులకు కష్టాలు, నష్టాలు, అప్పులే మిగులుతున్నాయి. చావే దిక్కవుతోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
అక్కా చెల్లెమ్మలు సూర్యుడు లేవక ముందే లేచి పొలానికి పోయి రాత్రి 7 గంటల వరకు నడుములు విరిగేలా పనిచేసినా రూ.100 కూడా కూలీ గిట్టని అధ్వాన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. గుంటూరు జిల్లా ఓదార్పుయాత్ర 37వ రోజు శుక్రవారం ఆయన చేబ్రోలు మండలంలోని పల్లెల్లో పర్యటించారు. 12 వైఎస్సార్ విగ్రహాలు ఆవిష్కరించారు.
పలు గ్రామాల్లో ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
రైతుల గురించి బాబు మాట్లాడింది ఇంత..: అసెంబ్లీ జరిగితే చంద్రబాబు నాయుడుగారు రైతుల కోసం అవిశ్వాసం పెడతానని గొప్పగా చెప్పారు. మొన్ననే అసెంబ్లీ జరిగింది. ఆశగా అందరం చూశాం. అవిశ్వాసం పెట్టడానికి ముందు ఆయన ఏం మాట్లాడుతారో? అని నిద్రాహారాలు మానుకొని అందరం టీవీల ముందు కూర్చొని అర్ధరాత్రి వరకు చూశాం. తీరా చూస్తే ఆయన రైతుల గురించి మాట్లాడింది.. ఇంత(వేలుతో అంగుళం చూపిస్తూ)! దివంగత నేత వైఎస్సార్ను అప్రదిష్టపాలు చేయడానికి మాట్లాడింది ఇంత(చేతులు బారుగా చాచి)! చంద్రబాబు గారి నైజమే అటువంటిది. ఆయన ఎప్పుడూ కూడా రాజకీయాలే ఆలోచన చేస్తారు. ఏ పని చేసినా దానివల్ల నాకేంటి లాభం అనే ఆలోచనతోనే ఆయన రాజకీయాలు ముందుకు పోతాయి. సొంత కూతురును ఇచ్చిన మామ ఎన్టీ రామారావునే పదవుల కోసం.. అధికారం కోసం వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు గారి గురించి అంతకంటే ఎక్కువ ఆలోచన చేయలేం.
తులసి మొక్కల్లా పెరుగుదాం అని చెప్పా..: చంద్రబాబు గారు ఏ ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టినా కూడా.. నేనైతే ఇక్కడి నుంచి(గుంటూరు) వెళ్లేటపుడే చెప్పి పోయా. జరుగుతున్నది అవిశ్వాస తీర్మానం. నాకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతు తెలిపితే డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై అయితే ఉప ఎన్నికలు జరగుతాయి. ఇవి అన్నీ తెలిసి కూడా నాకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లా.. వాళ్లను పిలిపించుకొని మాట్లాడా! ప్రతి ఒక్కరికీ ఒక విషయం చెప్పా. ‘మనం ప్రజల్లో ఉన్నాం.. ప్రజలు మనలను చూస్తున్నారు. విలువలు, విశ్వసనీయత లేని ఈ రాజకీయ వ్యవస్థలో ఒక తులసి మొక్కలా మనం పెరగాలి’ అని చెప్పా. ఇవాళ రైతన్న పరిస్థితి దారుణంగా ఉంది. రైతు కూలీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వీళ్ల కోసం మనం తోడుగా నిలబడలేకపోతేమటుకు ఈ రాజకీయ వ్యవస్థ ఉండటమే దండగ అని చెప్పా. నేను చెప్పిన ప్రతి మాటను కూడా ఎమ్మెల్యేలు గౌరవించారు. పదవులు పోతాయని తెలిసి కూడా... రైతన్నలకు తోడుగా, అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు.
చేబ్రోలు, న్యూస్లైన్ : వడ్లమూడి నుంచి చేబ్రోలు వస్తున్న జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ని రైతులు ఆపి తమ గోడు చెప్పుకున్నారు. ఎకరానికి రూ.22 వేలు ఖర్చు పెట్టామని, ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని చేబ్రోలుకు చెందిన రైతు ఉగ్గం నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు సమస్యలు తీర్చేందుకే పనిచేస్తున్నట్టు జగన్ వారికి తెలిపారు. కూలి రేట్లు ఎలా ఉన్నాయంటూ పక్కనే ఉన్న కూలీలను అడిగారు. రోజుకు వంద రూపాయిలిస్తున్నట్టు మహిళా కూలీలు తెలిపారు. కూలి గిట్టుబాటవుతుందా.. వడ్లమూడి నుంచి చేబ్రోలు వస్తున్న సమయంలో జగన్ కాన్వాయ్ని చూసిన కూలీలు పరుగున రోడ్డుపైకి వచ్చారు. వరి కుప్ప వేస్తే ఎకరాకు ఎంత కూలి ఇస్తున్నారు.. పెరిగిన నిత్యావసరాల ధరల ప్రకారం కూలి గిట్టుబాటు అవుతుందా.. లేదా.. రోజుకూలి కుటుంబ పోషణకు సరిపోతుందా.. అంటూ జగన్ ప్రశ్నించారు. అంతంతమాత్రం ఆదాయంతోనే రోజులు నెట్టుకొస్తున్నామని కూలీలు జగన్కు చెప్పారు. ఈ ప్రభుత్వం తమను ఆదుకోవడంలేదని, వైఎస్ జీవించి ఉంటే బతుకులు మారేవని జగన్మోహన్రెడ్డి వద్ద వాపోయారు. అవ్వా.. ఎలాఉన్నావు చేబ్రోలు, న్యూస్లైన్: చేబ్రోలు నుంచి పాతరెడ్డిపాలెం వెళ్లే దారిలో చీలిపాలెం వద్ద వృద్ధులు జననేత జగన్మోహన్రెడ్డిని కలసి ‘నాయనా నువ్వు చల్లగా ఉండాలయ్యా.. మీ నాన్న ప్రవేశపెట్టిన పథకాలన్నీ కొనసాగాలంటే నువ్వు ముఖ్యమంత్రివి కావాలి..’ అని దీవించారు. జగన్ వారిని ఆప్యాయంగా పలకరించి కొద్దిసేపు మాట్లాడారు. మా ఊరికి రావాల్సిందే.. చేబ్రోలు, న్యూస్లైన్: కొత్తరెడ్డిపాలెం నుంచి చేబ్రోలు వైపు వెళుతున్న జగన్ కాన్వాయ్ను గొడవ ర్రుకు చెందిన వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు నిలిపివేసి తమ గ్రామానికి రావాలని పట్టుబట్టారు. మూడు ట్రాక్లర్లలో వచ్చిన వారంతా కాన్వాయ్ ముందు బైఠాయిం చారు. ఆ గ్రామానికి వెళ్లేందుకు జననేత అంగీకరించడంతో అభిమానులు కేరింతలు కొట్టి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అభిమానమంటే అదే.. చేబ్రోలు, న్యూస్లైన్: కొత్తరెడ్డిపాలెం చేరుకున్న జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చల్లా వెంకటేశ్వరరెడ్డి నివాసంలో అల్పాహార విందుకు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు అక్కడికి చేరుకుని జగన్ను చూసేందుకు పోటీపడ్డారు. జననేత అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అదే గ్రామంలో అభిమానుల కోరిక మేరకు జగన్ ఎండ్లబండి ఎక్కారు. ఆకట్టుకున్న వైఎస్ వేషధారి చేబ్రోలు, న్యూస్లైన్: చేబ్రోలులోని పాతరెడ్డిపాలేనికి చెందిన మంచాల బిక్షాలు, వైఎస్ వేషధారణతో ఆకట్టుకున్నాడు. అభివాదం చేస్తూ పిల్లలను, వైఎస్ అభిమానులను ఎంతగానో ఆకర్షించాడు. వైఎస్సార్ పుట్టినరోజునే తన పుట్టినరోజు కూడా అని బిక్షాలు చెప్పాడు. ఓదార్పుయాత్ర జరిగే ప్రాంతాల్లో తాను వైఎస్ వేషధారణలో పాల్గొంటున్నట్లు తెలిపాడు. మాదీ పులివెందులే.. చీలిపాలెం (చేబ్రోలు), న్యూస్లైన్: జననేత జగన్మోహన్రెడ్డిని చూసేందుకు చీలిపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు రోడ్డుకిరువైపులా నిలబడ్డారు. జగన్ తన కాన్వాయ్ను ఆపించి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ఉపాధ్యాయిని జగన్నుద్దేశించి ‘అన్నా! నాదీ పులివెందులే..’ అని చెప్పారు. స్పందించిన జననేత.. విద్యార్థులు బాగోగులను తెలుసుకుని వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ఆమెకు సూచించారు. జగనన్నను చూశాం.. చేబ్రోలు, న్యూస్లైన్: కొత్తరెడ్డిపాలెంలో విగ్రహావిష్కరణకు వచ్చిన జగన్మోహన్రెడ్డిని చూసేందుకు విద్యార్థులు ప్రహరీలు, దేవాలయం గేట్లు ఎక్కారు. జై జగన్ అంటూ.. తమ అభిమానం చాటుకున్నారు. జగన్ అభివాదం చేయడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. జగనన్నను చూశాం.. అంటూ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. చేబ్రోలు నుంచి పాతరెడ్డిపాలెం వెళ్తున్న జగన్ మోహన్రెడ్డిని చూసేందుకు ఏబీఎం పాఠశాల, ఆర్సీఎం పాఠశాల, ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులు రోడ్డుకిరువైపులా బారులు తీరారు. జగన్ వారిని ఆప్యాయంగా పలకరించారు. అడిగిన వారందరికీ ఆటోగ్రాఫ్లిచ్చారు. భక్తిప్రపత్తులు వడ్లమూడి (చేబ్రోలు), న్యూస్లైన్: కొత్తరెడ్డిపాలెంలోని శ్రీ సీతారామాంజనేయస్వామి దేవస్థానంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులు జగన్కు స్వాగతం పలికి ఆలయానికి తీసుకెళ్లారు. స్వామి దర్శనం అనంతరం జననేత సమీపంలో ఉన్న గ్రామ బొడ్రాయి వద్ద పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చర్చి, మసీదుల్లో.. వడ్లమూడిలోని దర్గాలో శుక్రవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అదేవిధంగా పాత రెడ్డిపాలెం ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ చర్చిలో ఫాదర్ మణిబాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి జననేతకు ఆశీర్వచనాలు అందించారు. స్థానిక సమస్యలు జననేత దృష్టికి.. చేబ్రోలు, న్యూస్లైన్: చేబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త, పాతరెడ్డిపాలేల్లో పర్యటించినప్పుడు గ్రామ ప్రత్యేక అధికారుల పనితీరుపై జగన్మోహన్రెడ్డి ఆరాతీశారు. పలుచోట్ల కాన్వాయ్ని ఆపి గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి.. తాగునీరు సక్రమంగా అందుతుందా.. లేదా.. అంటూ ప్రశ్నించారు. కాలువలు పాడయిపోవడంతో ఎక్కడికక్కడ మురుగు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ మహిళలు జననేత దృష్టికి తీసుకెళ్లారు. ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి చేబ్రోలు, న్యూస్లైన్: కొత్తరెడ్డిపాలెంలో జగన్ పర్యటిస్తున్న సమయంలో ప్రధాన రహదారుల్లో పలువురు మహిళలు కాన్వాయ్కి ఎదురొచ్చి గుమ్మడికాయలతో జగన్కు దిష్టి తీశారు. మంగళహారతులిచ్చి జేజేలు పలికారు. రేయనక, పగలనక అలుపెరగకుండా ఓదార్పుయాత్ర నిర్వహిస్తున్న జగనన్నను దేవుడు చల్లగా చూడాలంటూ దీవించారు. బిడ్డా గెలుపు నీదే.. చేబ్రోలు, న్యూస్లైన్: ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేబ్రోలు సుగాలి కాలనీకి చేరుకున్నారు. అక్కడ కాలనీకి చెందిన పాలకొల్లు గౌరీశ్వరమ్మ (76) జననేతను వద్దకు వెళ్లి ‘బిడ్డా.. వచ్చే ఎన్నికల్లో గెలుపు నీదే.. మేమంతా నీకు అండగా ఉంటాం.. ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలి..’ అంటూ దీవించింది. ఆప్యాయతతో ఆ అవ్వను నుదుటిపై ముద్దాడి జననేత ముందుకు కదిలారు. జననేత సమక్షంలో జన్మదిన వేడుక చేబ్రోలు, న్యూస్లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మారూరి రామలింగారెడ్డి శుక్రవారం తన పుట్టినరోజును వైఎస్ జగన్ సమక్షంలో జరుపుకొన్నారు. విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీలో ఆయన జననేతను కలిశారు. ఆయన రామలింగారెడ్డికి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రామలింగారెడ్డి వెంట ఆయన సతీమణి శైలజ, పార్టీ నాయకుడు నరసింహారావు తదితరులున్నారు. |
0 comments:
Post a Comment