Home »
» వైఎస్ఆర్ కాంగ్రెస్ మైనార్టీసెల్ కన్వీనర్ గా రెహ్మాన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ మైనార్టీసెల్ కన్వీనర్ గా రెహ్మాన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అడ్ హాక్ కమిటీ కన్వీనర్ గా మాజీ ఎమ్మెల్సీ హబీబ్ అబ్దుల్ రెహ్మాన్ ని నియమించినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన నియామక పత్రాన్ని పార్టీ కార్యాలయంలో ఈరోజు రెహ్మాన్ కు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో బాజిరెడ్డి మాట్లాడారు. పేదలకు, విద్యార్థులకు, మైనార్టీలకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
చేబ్రోలులో మహానేత విగ్రహావిష్కరణ |
|
|
|
|
|
గుంటూరు: చేబ్రోలులో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పుయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విగ్రహావిష్కరణ అనంతరం జగన్ మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు, రైతు కూలీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. పేదలు, విద్యార్థులు ఎవరినోట విన్నా ఆ మహానేత డాక్టర్ వైఎస్ బతికి ఉంటే బాగుండేదని వినిపిస్తోందన్నారు. సమయం లేనందు ఎక్కవసేపు మాట్లాడలేనని, అర్ధం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. |
|
కొత్తరెడ్డిపాలెంలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ |
|
|
|
|
|
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కొత్తరెడ్డిపాలెం గ్రామంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా గ్రామానికి వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విగ్రహావిష్కరణ అనంతరం జగన్ చేసిన ప్రసంగానికి విశేష స్పందన లభించింది. |
|
0 comments:
Post a Comment