వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న రెండో విడత ఓదార్పు యాత్ర శుక్రవారంతో పూర్తయింది. మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో 44 రోజులపాటు 1146.5 కిలోమీటర్లు పర్యటించిన జననేత.. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలొదిలిన 22 మంది అభిమానుల కుటుంబాలను ఓదార్చారు. అలాగే 389 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. అక్టోబర్ 16న మంగళగిరి నియోజకవర్గంలోని సీతానగరంలో ప్రారంభమైన తొలివిడత యాత్ర దీపావళి సందర్భంగా ఒకరోజు విరామంతో నవంబర్ 2న రేపల్లె వరకు సాగింది. తిరిగి నవంబర్ 16న రెండో విడత యాత్ర రేపల్లె నుంచి ప్రారంభమై శుక్రవారం తాడికొండ మండలం సిరిపురంలో ముగిసింది. సర్కారుపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో రెండో విడతలో వైఎస్ జగన్ డిసెంబర్ 3 నుంచి 6 వరకు యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. మొత్తం రెండు విడతల షెడ్యూల్లో మంగళగిరి, తెనాలి, వేమూరు, రేపల్లె, బాపట్ల, పొన్నూరు, ప్రత్తిపాడు(ప్రత్తిపాడు మండలం మినహా), తాడికొండ(ఫిరంగిపురం మండలం మినహా) నియోజకవర్గాల్లో ఓదార్పు యాత్ర పూర్తయింది.
న్యాయానికీ.. ధర్మానికీ గోరీ: జగన్ | |
కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు కలసికట్టుగా వైఎస్పై కుట్ర చేస్తున్నారు: వైఎస్ జగన్ | |
|
0 comments:
Post a Comment