హైదరాబాద్, న్యూస్లైన్: అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు సంక్షేమ పథకాల విషయంలో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఫీజుల చెల్లింపు, పావలా వడ్డీ, రైతుల రుణాలకు సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన లెక్కలన్నీ తప్పుల తడకేనని అన్నారు.
సంక్షేమ పథకాలపై చేస్తున్న ఖర్చుపైన శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తున్నామని, విద్యార్థులకు ఫీజుల రీయింబర్స్మెంట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చెల్లిస్తున్నామని ప్రజలను మభ్యపెట్టే యత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, బలహీన వర్గాలు, మహిళల సంక్షేమానికి సంబంధించి 13 అంశాలపై రూ.13,445 కోట్ల కోత విధించినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొన్నా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని విమర్శించారు.
‘‘ఈ ఏడాది బడ్జెట్లో ఫీజుల పథకానికి రూ.3,200 కోట్లు కేటాయించి రూ.990 కోట్లు మాత్రమే విడుదల చేశారు. అలాంటప్పుడు రూ.5,500 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి నిండు సభలో ఎలా చెబుతారు? ఇంత కన్నా పచ్చి అబద్ధం మరొకటి ఉంటుందా? నిజంగా రైతులకు పావలా వడ్డీ రుణాలు ఇస్తే.. ప్రభుత్వం అంటున్నట్లు అంతా పచ్చగా ఉంటే అన్నదాతలు ఎందుకు క్రాప్ హాలిడేను ప్రకటిస్తున్నారు? వరి, పత్తి, పసుపు పంటలకు గిట్టుబాటు ధర ఎందుకు లేదు?’’ అని ప్రశ్నించారు. రూ.10 వేల కోట్ల మేరకు రైతులకు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారనీ, అయితే సగానికి పైగా సీజన్ అయిపోయినా ఇప్పటికి వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారని పద్మ తెలిపారు.
ఇప్పటికే రూ.2,700 కోట్ల పావలా వడ్డీ రుణాల బకాయిలు చెల్లించాల్సి ఉండగా మళ్లీ కొత్తగా వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రకటించడం విడ్డూరమన్నారు. బలహీన వర్గాల విద్యార్థుల హాస్టళ్లు, గురుకుల ఆశ్రమ పాఠశాలలకు ఇచ్చే నిధుల విషయంలో కూడా ప్రభుత్వం తప్పుడు లెక్కలే చెప్పిందని అన్నారు.
సంక్షేమ పథకాలపై చేస్తున్న ఖర్చుపైన శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తున్నామని, విద్యార్థులకు ఫీజుల రీయింబర్స్మెంట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చెల్లిస్తున్నామని ప్రజలను మభ్యపెట్టే యత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, బలహీన వర్గాలు, మహిళల సంక్షేమానికి సంబంధించి 13 అంశాలపై రూ.13,445 కోట్ల కోత విధించినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొన్నా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని విమర్శించారు.
‘‘ఈ ఏడాది బడ్జెట్లో ఫీజుల పథకానికి రూ.3,200 కోట్లు కేటాయించి రూ.990 కోట్లు మాత్రమే విడుదల చేశారు. అలాంటప్పుడు రూ.5,500 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి నిండు సభలో ఎలా చెబుతారు? ఇంత కన్నా పచ్చి అబద్ధం మరొకటి ఉంటుందా? నిజంగా రైతులకు పావలా వడ్డీ రుణాలు ఇస్తే.. ప్రభుత్వం అంటున్నట్లు అంతా పచ్చగా ఉంటే అన్నదాతలు ఎందుకు క్రాప్ హాలిడేను ప్రకటిస్తున్నారు? వరి, పత్తి, పసుపు పంటలకు గిట్టుబాటు ధర ఎందుకు లేదు?’’ అని ప్రశ్నించారు. రూ.10 వేల కోట్ల మేరకు రైతులకు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారనీ, అయితే సగానికి పైగా సీజన్ అయిపోయినా ఇప్పటికి వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారని పద్మ తెలిపారు.
ఇప్పటికే రూ.2,700 కోట్ల పావలా వడ్డీ రుణాల బకాయిలు చెల్లించాల్సి ఉండగా మళ్లీ కొత్తగా వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రకటించడం విడ్డూరమన్నారు. బలహీన వర్గాల విద్యార్థుల హాస్టళ్లు, గురుకుల ఆశ్రమ పాఠశాలలకు ఇచ్చే నిధుల విషయంలో కూడా ప్రభుత్వం తప్పుడు లెక్కలే చెప్పిందని అన్నారు.
|
0 comments:
Post a Comment