ఎమ్మార్ కేసులో అరెస్టయిన సునీల్రెడ్డికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి 1వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. ఎమ్మార్ కేసులో సునీల్రెడ్డిని ఏడో నిందితుడిగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సీబీఐ 15 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది.
దీనిపై సునీల్రెడ్డి తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పకుండా అసమగ్రమైన రిమాండ్ రిపోర్ట్ను సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారని చెప్పారు. కస్టడీకి అప్పగించాలన్న సీబీఐ కోరిక ఆక్షేపణీయమని వాదించారు. దీనిపై ఏవైనా వాదనలు వినిపించాలనుకుంటే కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగమారుతి శర్మ అశోక్ రెడ్డికి సూచిస్తూ విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు.
దీనిపై సునీల్రెడ్డి తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పకుండా అసమగ్రమైన రిమాండ్ రిపోర్ట్ను సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారని చెప్పారు. కస్టడీకి అప్పగించాలన్న సీబీఐ కోరిక ఆక్షేపణీయమని వాదించారు. దీనిపై ఏవైనా వాదనలు వినిపించాలనుకుంటే కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగమారుతి శర్మ అశోక్ రెడ్డికి సూచిస్తూ విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు.
0 comments:
Post a Comment