నరసరావుపేటలో ఈ నెల 27న జగన్ ధర్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నరసరావుపేటలో ఈ నెల 27న జగన్ ధర్నా

నరసరావుపేటలో ఈ నెల 27న జగన్ ధర్నా

Written By ysrcongress on Thursday, January 26, 2012 | 1/26/2012

*వస్త్రాలపై వ్యాట్ పెంపునకు నిరసన
*వైఎస్సార్ చౌక్ వేదికగా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఆందోళన

నరసరావుపేట (గుంటూరు)/ హైదరాబాద్, న్యూస్‌లైన్: వస్త్రాలపై రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 5% వ్యాట్‌ను తక్షణమే రద్దు చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం సమీపంలోని వైఎస్సార్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. స్థానిక షాదీఖానాలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు వివరాలు వెల్లడించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. 

ఓదార్పుయాత్రలో భాగంగా జగన్ గురువారం రాత్రి నరసరావుపేటకు చేరుకుంటారు. పార్టీ నాయకుడు గజ్జల బ్రహ్మారెడ్డి నివాసంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు రామిరెడ్డిపేటలోని కేర్ పబ్లిక్ స్కూల్ వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి రహదారి ప్రవేశద్వారాన్ని, వైఎస్సార్ విగ్రహా న్ని ఆవిష్కరిస్తారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ధర్నాలో పాల్గొంటారు. వ్యాట్ విధింపును నిరసిస్తూ వస్త్ర వ్యాపారులు చేపట్టిన బంద్‌కు మద్దతుగా రాష్ట్రంలో ఏ నాయకుడు ఇంతవరకు ధర్నా చేయలేదని, జగన్ మాత్రమే వారికి మద్దతుగా ధర్నాకు పూనుకున్నారని పార్టీ నేతలు తెలిపారు.
Share this article :

0 comments: