రాష్ట్రంలో 5 కోట్ల 57 లక్షల మంది ఓటర్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో 5 కోట్ల 57 లక్షల మంది ఓటర్లు

రాష్ట్రంలో 5 కోట్ల 57 లక్షల మంది ఓటర్లు

Written By ysrcongress on Tuesday, January 24, 2012 | 1/24/2012

రాష్ట్రంలో 5 కోట్ల 57 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డులలో తొలి స్థానం ఆంధ్రప్రదేశ్ దేనని చెప్పారు. 40 లక్షల నకిలీ ఓటరు కార్డులు తొలగించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 2,78, 48,792 మంది పురుష ఓటర్లు,2,79,14,616 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు వివరించారు. 20 మంది హిజ్రాలకు కూడా ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. 

ఓటరు డే సందర్భంగా రేపు 33 లక్షల మందికి కొత్త కార్డులు ఇస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో ఎపి ఆన్ లైన్ ద్వారా ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం 66, 273 కేంద్రాలలో రేపు ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
Share this article :

0 comments: