కరెంటు బిల్లులు కట్టని రైతులను జైల్లో పెట్టాలంటూ చంద్రబాబు తన హయాంలో ఇచ్చిన జీవో కాపీలను రైతు దీక్ష వేదికపై జగన్మోహన్రెడ్డి చూపారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మించి మరో వ్యక్తి ఉన్నాడు. ఆయనే చంద్రబాబునాయుడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ నేతకైనా విశ్వసనీయత, విలువలు అంటే అర్థం తెలిసిఉండాలి. ఆయ న చేసే పనులు ఏవీ కూడా రైతులు, పేదలపై ప్రేమతో కాదు. ‘‘నాకేంటి లాభం..?’’ అన్న ఆలోచనతోనే చేస్తున్నారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు బట్టలారేసుకునేందుకే ఉపయోగపడతాయన్న చంద్రబాబు.. ఇప్పుడు నిస్సిగ్గుగా తానే తొమ్మిది గంటల కరెంటు ఇస్తానని అబద్ధాలు చెబుతున్నారు. రైతులు కరెంటు బిల్లులు కట్టకుంటే వారిని జైల్లో పెట్టేందుకు, శిక్షించేందుకు ఆయన జీవో నం.89, జీవో నం.99లు జారీ చేశారు. జీవో 89లో... కరెంటు బిల్లులు కట్టని రైతులను వారెం టు కూడా లేకుండా అరెస్టు చేయండి అని చెప్పారు.
అంతటితో ఆగకుండా బిల్లులు చెల్లించని రైతులకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించాలి.. అని ఇదే జీవోలో చెప్పారు. కరెంటు బిల్లులు కట్టని రైతులను శిక్షించేందుకు స్పెషల్ కోర్టును ఏర్పాటు చేస్తూ జీవో 99 తెచ్చారు. రైతులపై బాబుకు ఉన్న ప్రేమ ఇదీ..! అంతకుముందు రూ.50 ఉన్న హార్స్పవర్ విద్యుత్తు బిల్లును రూ.650కి పెంచిన పెద్దమనిషి కూడా చంద్రబాబే. వైఎస్ ఐదేళ్లపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును అమలు చేసి చూపించిన తర్వాత.. ఎన్నికలకు పోయినప్పుడు నేను కూడా ఇస్తా అంటూ బాబు చెప్పారు. మళ్లీ ఇటీవల కరీంనగర్ సభకు వెళ్లినప్పుడు.. ‘‘విద్యుత్తు తీగలు చూపిస్తూ.. చూశారా... ఆ రోజే నేను చెప్పా. ఉచితంగా కరెంటిస్తే బట్టలారేసుకోవాల్సి వస్తుంది.. అదే నిజమైంది..’’ అని ఇదే చంద్రబాబు అన్నారు. ఒక మనిషి ఏ మాత్రం విలువలు, విశ్వసనీయత లేకుండా మాట మార్చుకుంటూ పోతాడో చెప్పేందుకు చంద్రబాబే ఒక ఉదాహరణ’’ అని జగన్ అన్నారు.
అంతటితో ఆగకుండా బిల్లులు చెల్లించని రైతులకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించాలి.. అని ఇదే జీవోలో చెప్పారు. కరెంటు బిల్లులు కట్టని రైతులను శిక్షించేందుకు స్పెషల్ కోర్టును ఏర్పాటు చేస్తూ జీవో 99 తెచ్చారు. రైతులపై బాబుకు ఉన్న ప్రేమ ఇదీ..! అంతకుముందు రూ.50 ఉన్న హార్స్పవర్ విద్యుత్తు బిల్లును రూ.650కి పెంచిన పెద్దమనిషి కూడా చంద్రబాబే. వైఎస్ ఐదేళ్లపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును అమలు చేసి చూపించిన తర్వాత.. ఎన్నికలకు పోయినప్పుడు నేను కూడా ఇస్తా అంటూ బాబు చెప్పారు. మళ్లీ ఇటీవల కరీంనగర్ సభకు వెళ్లినప్పుడు.. ‘‘విద్యుత్తు తీగలు చూపిస్తూ.. చూశారా... ఆ రోజే నేను చెప్పా. ఉచితంగా కరెంటిస్తే బట్టలారేసుకోవాల్సి వస్తుంది.. అదే నిజమైంది..’’ అని ఇదే చంద్రబాబు అన్నారు. ఒక మనిషి ఏ మాత్రం విలువలు, విశ్వసనీయత లేకుండా మాట మార్చుకుంటూ పోతాడో చెప్పేందుకు చంద్రబాబే ఒక ఉదాహరణ’’ అని జగన్ అన్నారు.
0 comments:
Post a Comment