టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన బినామీల అక్రమాస్తుల కేసును నిష్పాక్షిక విచారణ నిమిత్తం రాష్ట్రం నుంచి మరో హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ గురువారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ దల్వీర్ భండారీ, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది. చంద్రబాబు, సి.ఎం.రమేష్ తదితరులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ‘నాట్ బిఫోర్ నాటకాలతో’ నిష్పాక్షిక విచారణపై అనుమానాలు రేకెత్తించారని, తద్వారా ప్రజాప్రయోజనాలకు తీరని నష్టం వాటిల్లుతోందని విజయమ్మ డిసెంబర్ రెండోవారంలో పిటిషన్ దాఖలు చేశారు.
‘‘చంద్రబాబు తదితరులు ‘నాట్ బిఫోర్’ల ద్వారా నిష్పాక్షిక విచారణపై అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు ధర్మాసనాల ఎదుట ‘నాట్ బిఫోర్’లుగా ఉన్న లాయర్లతో వకాలత్లు దాఖలు చేయించారు. తమకు కావాల్సిన బెంచ్ కోసం వారిని వాడుకున్నారు. విచారణ జరుగుతున్న తీరును చూస్తుంటే చంద్రబాబు తదితరులు న్యాయప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నట్లుగా ఉంది. హైకోర్టులో నిష్పాక్షిక విచారణ జరిగే పరిస్థితులు లేవు’’అని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ‘అలాంటి పరిస్థితులున్నప్పుడు కేసును బదిలీ చేయవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. న్యాయం బతకాలంటే కేసును మరో హైకోర్టుకు బదిలీ చేయండి’ అని ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
‘‘చంద్రబాబు తదితరులు ‘నాట్ బిఫోర్’ల ద్వారా నిష్పాక్షిక విచారణపై అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు ధర్మాసనాల ఎదుట ‘నాట్ బిఫోర్’లుగా ఉన్న లాయర్లతో వకాలత్లు దాఖలు చేయించారు. తమకు కావాల్సిన బెంచ్ కోసం వారిని వాడుకున్నారు. విచారణ జరుగుతున్న తీరును చూస్తుంటే చంద్రబాబు తదితరులు న్యాయప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నట్లుగా ఉంది. హైకోర్టులో నిష్పాక్షిక విచారణ జరిగే పరిస్థితులు లేవు’’అని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ‘అలాంటి పరిస్థితులున్నప్పుడు కేసును బదిలీ చేయవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. న్యాయం బతకాలంటే కేసును మరో హైకోర్టుకు బదిలీ చేయండి’ అని ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
0 comments:
Post a Comment