భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాల కూల్చివేతను వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. మహనీయుడైన అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం అత్యంత హేయమైన చర్య అని సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీన్ని పెద్ద నేరంగా పరిగణించి, బాధ్యులపై కఠిన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
నేడు వైఎస్సార్ కాంగ్రెస్ నిరసనలు
అంబేద్కర్ విగ్రహాల కూల్చివేతకు నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆయన విగ్రహాల వద్ద ధర్నా చేస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ దళిత విభాగం అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశరావు ఓ ప్రకటనలో తెలిపారు. విగ్రహాలను పాలతో శుద్ధి చేయాలని, వాటికి రక్షణ కల్పించలేని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు
0 comments:
Post a Comment