మాజీ మంత్రి ఎస్.సంతోష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రేపు రైతుదీక్ష చేపట్టనున్న ఆర్మూరు సభలో పార్టీ సభ్యత్వం తీసుకుంటానని చెప్పారు. ఈరోజు ఆయన జగన్ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సన్నిహితులు, అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు వైఎస్సార్ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
రైతులు, రైత కూలీల కోసం జగన్ చేపట్టనున్న 48 గంటల ‘రైతుదీక్ష’ను నిజమాబాద్ జిల్లా చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో విజయవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ‘‘నిజమాబాద్ జిల్లాలో పసుపు రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. వైఎస్ హయాంలో క్వింటాల్ 18 వేల రూపాయలు పలికిన ధర నేడు 3 వేల రూపాయలకు పడిపోయింది. ప్రభుత్వ చర్యల వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారు’’ అని అన్నారు.
‘‘జిల్లాలో ఎర్రజొన్నలు పండించిన రైతులకు ప్రభుత్వం 10 కోట్ల 80 లక్షల రూపాయలు బకాయి ఉంది. ఏళ్లు గడుస్తున్నా బకాయిలు చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. రైతుదీక్ష ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వసూలు చేస్తాం’’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతుదీక్షను అడ్డుకుంటామని టీఆర్ఎస్, జేఏసీలు ప్రకటనలు చేయడం సరైన పద్దతి కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తున్నందునే రాజీనామా చేసిన ఎమ్మల్యేల స్థానాల్లో పోటీపెట్టడం లేదని గుర్తు చేశారు. రైతుల కోసం చేస్తున్న మంచి కార్యక్రమానికి ప్రతిఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
రైతులు, రైత కూలీల కోసం జగన్ చేపట్టనున్న 48 గంటల ‘రైతుదీక్ష’ను నిజమాబాద్ జిల్లా చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో విజయవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ‘‘నిజమాబాద్ జిల్లాలో పసుపు రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. వైఎస్ హయాంలో క్వింటాల్ 18 వేల రూపాయలు పలికిన ధర నేడు 3 వేల రూపాయలకు పడిపోయింది. ప్రభుత్వ చర్యల వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారు’’ అని అన్నారు.
‘‘జిల్లాలో ఎర్రజొన్నలు పండించిన రైతులకు ప్రభుత్వం 10 కోట్ల 80 లక్షల రూపాయలు బకాయి ఉంది. ఏళ్లు గడుస్తున్నా బకాయిలు చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. రైతుదీక్ష ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వసూలు చేస్తాం’’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతుదీక్షను అడ్డుకుంటామని టీఆర్ఎస్, జేఏసీలు ప్రకటనలు చేయడం సరైన పద్దతి కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తున్నందునే రాజీనామా చేసిన ఎమ్మల్యేల స్థానాల్లో పోటీపెట్టడం లేదని గుర్తు చేశారు. రైతుల కోసం చేస్తున్న మంచి కార్యక్రమానికి ప్రతిఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
0 comments:
Post a Comment