పేదరికాన్ని చూసే అవకాశం లభించింది: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పేదరికాన్ని చూసే అవకాశం లభించింది: జగన్

పేదరికాన్ని చూసే అవకాశం లభించింది: జగన్

Written By ysrcongress on Thursday, January 26, 2012 | 1/26/2012

ఓదార్పుయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తేళ్లగుంటకు చేరుకున్నారు. తేళ్లగుంటలో గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. తేళ్లగుంటలో జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. 

మహానేత మరణించిన తర్వాత... వైఎస్ ఆకస్మిక మృతిని తట్టుకోలేక మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను ఓదార్చమని దేవుడే తనతో చెప్పాడని జగన్ అన్నారు. ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిని ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని జగన్ అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందుకే తనకు ఇన్ని కష్టాలు, సీబీఐ దాడులు అని జగన్ అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రంలో పేద ప్రజల బతుకు తెలిసేది కాదు అన్నారు. 

ఏ రాజకీయ నాయకుడు తిరగని దూరం... తాను రాష్ట్రంలో తిరిగానని.. ఎన్నో పూరి గుడిసెల జీవితాల్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం తనకు కలిగిందన్నారు. త్వరలోనే వైఎస్‌ఆర్ సువర్ణయుగం రానున్నదని ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే... ఎప్పటికీ తనకు పేదవారి కష్టాలు తెలిసేవి కాదని జననేత అన్నారు.
Share this article :

0 comments: