నీచమైన రాజకీయాలు చేసేబదులు నేరుగా కాల్చి చంపేయవచ్చుగదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నీచమైన రాజకీయాలు చేసేబదులు నేరుగా కాల్చి చంపేయవచ్చుగదా

నీచమైన రాజకీయాలు చేసేబదులు నేరుగా కాల్చి చంపేయవచ్చుగదా

Written By ysrcongress on Tuesday, January 24, 2012 | 1/24/2012

 నీచమైన రాజకీయాలు చేసేబదులు నేరుగా కాల్చి చంపేయవచ్చుగదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. గురజాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై తనపై కక్ష సాధింపుకు దిగాయన్నారు. సిబిఐ దాడుల పేరిట తనని, తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని బాధపడ్డారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో క్రూరమైన రాజకీయం నడుస్తోందన్నారు. ఆ పార్టీ ఉండకూడదని, ఆ మనిషి ఉండకూడదని ఇన్ని రాజకీయాలు చేసేబదులు కాల్చి చంపేయవచ్చుగదా అన్నారు. 

ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మనసున్న మారాజులా ఉండాలని చాటిచెప్పిన మహావ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్ అన్నారు. ప్రతి పేదవాడి గుండెల్లో చెరగని ముద్ర వైఎస్ఆర్ అని చెప్పారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్ లకు వైఎస్ నిజాయితీ గురించి తెలియదా? అని జగన్ ప్రశ్నించారు. 

వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు దక్కవన్నారు. చంద్రబాబుకు నిజాయితీ ఉంటే తనపై సిబిఐ విచారణ జరిపించుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెరిటేజ్ దుకాణాలు ఎలా పెట్టారో చంద్రబాబు చెప్పాలన్నారు.
Share this article :

0 comments: