‘అన్నా.. మీ నాన్న వల్ల మా కుటుంబం బాగుపడింది. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘అన్నా.. మీ నాన్న వల్ల మా కుటుంబం బాగుపడింది.

‘అన్నా.. మీ నాన్న వల్ల మా కుటుంబం బాగుపడింది.

Written By ysrcongress on Friday, January 6, 2012 | 1/06/2012

మండల కేంద్రమైన ఫిరంగిపురంలోని విజయదుర్గానగర్ కాలనీలో నివాసముంటున్న మేడా పోతురాజు కుటుంబసభ్యులను గురువారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్చారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మృతికి కలత చెందిన పోతురాజు గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. వారి కుటుంబసభ్యుల వివరాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా తానున్నానంటూ భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మృతుడి భార్య పార్వతి మాట్లాడుతూ తన కుటుంబానికి పెద్ద కొడుకులా వచ్చి పరామర్శించడం ఊరటనిచ్చిందన్నారు. వైఎస్సార్ అంటే తన భర్తకు ఎంతో అభిమానమని చెప్పారు. ఎక్కడ ఆయన సమావేశాలు జరిగినా తప్పకుండా వెళ్తుండేవాడని గుర్తుచేసుకుని బోరున విలపించారు. తన కుటుంబానికి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసా సంతృప్తి నిచ్చిందని చెప్పారు. 

సత్తెనపల్లి రూరల్, న్యూస్‌లైన్: ‘అన్నా.. మీ నాన్న వల్ల మా కుటుంబం బాగుపడింది. ఆయనకు నాన్నగారంటే ఎంతో అభిమానం..’ అంటూ రాజారపు సాంబశివరావు భార్య సామ్రాజ్యం ఆవేదనతో జగన్ వద్ద కన్నీటి పర్యంతమైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మృతితో మనోవేదనకు గురై గుండెపోటుతో చనిపోయిన సాంబశివరావుకు చెందిన కుటుంబాన్ని కొమెరపూడిలో గురువారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్చారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. చిన్న వయసులో ఉన్న ఇద్దరు కుమారులు శ్రీనాథ్, హర్షవర్ధన్‌లను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని చెప్పారు. కుటుంబానికి ఎలాంటి సమస్యలున్నా తానున్నానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సామ్రాజ్యం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ఆ మహానేత కుమారుడు ఇంటికి వచ్చి అందరితో మాట్లాడడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
Share this article :

0 comments: