రేపటి నుంచి పెదకూరపాడు నుంచి ఓదార్పు పునప్రారంభం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపటి నుంచి పెదకూరపాడు నుంచి ఓదార్పు పునప్రారంభం

రేపటి నుంచి పెదకూరపాడు నుంచి ఓదార్పు పునప్రారంభం

Written By ysrcongress on Monday, January 16, 2012 | 1/16/2012

 ఓదార్పుయాత్ర రేపటి నుంచి గుంటూరు జిల్లాలో పున ప్రారంభం కానుంది. పెదకూరపాడులో మహానేత విగ్రహావిష్కరణతో యాత్ర ప్రారంభమవుతుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలు మర్రి రాజశేఖర్‌, తలశిల రఘురాం తెలిపారు. అక్కడి నుంచి రామాపురం, బుచ్చయ్యపాలెంలో జగన్‌ పర్యటిస్తారు. 

అత్తలూరులో రెండు వైఎస్‌ విగ్రహాలు ఆవిష్కరించిన అనంతరం జూపూడి చేరుకుంటారు. అక్కడ వైఎస్‌ఆర్‌ విగ్రహం ఆవిష్కరిస్తారు. మునుగోడులో గ్రామప్రజలు అభిమానంతో ఏర్పాటు చేసుకున్న అయిదు మహానేత విగ్రహాలను వైఎస్‌ జగన్‌ ఆవిష్కరిస్తారు. బయ్యవరం మీదుగా ఊటుకూరు చేరుకుని రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించటంతో పాటు మహానేత మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన జెర్రిపోతు భద్రమ్మ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. ఓదార్పు యాత్ర కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేతలు సన్నద్ధం అవుతున్నారు.
Share this article :

0 comments: