వైఎస్ చలవతో ఎంసీఏ చదువుతున్నా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ చలవతో ఎంసీఏ చదువుతున్నా..

వైఎస్ చలవతో ఎంసీఏ చదువుతున్నా..

Written By ysrcongress on Friday, January 6, 2012 | 1/06/2012

ఎక్కడ మా చదువులు మధ్యలో ఆగిపోతాయోనన్న ఆందోళనలో ఉన్న తరుణంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి మేము ఉన్నత చదువులు చదువుకునేలా అవకాశం కల్పించారు..’ అని 113 త్యాళ్ళూరుకు చెందిన ఎంసీఏ ఫైనలియర్ విద్యార్థిని కంభంపాటి చైతన్య తమ గ్రామానికి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డికి తెలిపారు. తమది నిరుపేద కుటుంబమని చెప్పారు. ఇంటర్ వరకు చదువుకుని ఆర్థిక పరిస్థితి బాగోలేక చదువు ఆపేద్దామనుకున్న సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టి తాను ఎంసీఏ వరకు చదువుకునే అవకాశాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి కల్పించారని తెలిపారు. 

రాష్ట్రంలో అనేక మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధిపొంది ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారనంటే అది వైఎస్సార్ చలువేనన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తుంగలో తొక్కి విద్యార్థులకు తీరని అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మున్ముందు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, పింఛన్ వంటి పథకాలు అమలు జరిగి పేదలు ఆర్థికంగా పుంజుకోవాలంటే తిరిగి రాష్ట్రంలో మహానేత తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారాన్ని చేపట్టాలని, దానికి మద్దతుగా ప్రజలంతా ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చైతన్య కోరారు.

Share this article :

0 comments: