రాష్ట్రంలో ఏ పార్టీ పాలన చేసినా తమకు కావలసింది తెలంగాణ అని ప్రజాసంఘాల జెఎసి కన్వీనర్ గజ్జల కాంతం స్పష్టం చేశారు. ఈరోజు ఆయన స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ ఆర్మూరులో రైతు సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి దీక్ష చేపట్టడం సమంజసమేనన్నారు. జగన్ దీక్షని స్వాగతిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఇస్తే తమకు అభ్యంతరంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని ఆయన కోరారు. తెలంగాణ సెంటిమెంట్ ని గౌరవిస్తూ తెలంగాణలో జరిగే ఉప ఎన్నికలలో పోటీకి పెట్టం అన్న జగన్ ప్రకటనని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణకు తాను అడ్డు తగలనని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలకుర్తి సభలో చెప్పారని, అదే విషయాన్ని కేంద్రానికి లేఖ రాయాలని కాంతం డిమాండ్ చేశారు. ఆయన లేఖ రాసిన తరువాత తెలంగాణలో ఎక్కడ తిరిగినా తమకు అభ్యంతరంలేదన్నారు.
తెలంగాణకు తాను అడ్డు తగలనని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలకుర్తి సభలో చెప్పారని, అదే విషయాన్ని కేంద్రానికి లేఖ రాయాలని కాంతం డిమాండ్ చేశారు. ఆయన లేఖ రాసిన తరువాత తెలంగాణలో ఎక్కడ తిరిగినా తమకు అభ్యంతరంలేదన్నారు.
0 comments:
Post a Comment