దుకాణదారులకు మద్దతుగా ప్రజలంతా ఈ ధర్నాలో పాలుపంచుకోవాలని కోరుతున్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దుకాణదారులకు మద్దతుగా ప్రజలంతా ఈ ధర్నాలో పాలుపంచుకోవాలని కోరుతున్నా

దుకాణదారులకు మద్దతుగా ప్రజలంతా ఈ ధర్నాలో పాలుపంచుకోవాలని కోరుతున్నా

Written By ysrcongress on Friday, January 27, 2012 | 1/27/2012


*వస్త్ర వ్యాపారులకు అండగా నిలుద్దాం 
*వ్యాట్ విధింపుపై ఆరు నెలలుగా పోరాటం చేస్తున్నా చలనం లేదు
*ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి.. చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా తయారైంది

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వస్త్రాలపై వ్యాట్ తగ్గించాలని చిన్న చిన్న వ్యాపారులు కూడా దుకాణాలు మూసివేసి సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు.. ఈ పాలకుల కళ్లు తెరిపించేందుకు ప్రజలు సిద్ధం కావాలి..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పేద వ్యాపారులకు తోడుగా నిలుద్దామని అన్నారు. గురువారం గుంటూరు జిల్లా గురజాల పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి జగన్... 58వ రోజు ఓదార్పు యాత్రను ప్రారంభించారు. 

గురజాల నియోజకవర్గం దాచేపల్లి, గురజాల మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జగన్నాథపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాను బొడ్డపాటి అంజిరెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. మొత్తం ఏడు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ప్రసంగించారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...

చెవిటివాని ముందు శంఖం ఊదినట్టుగా..
పెంచిన వ్యాట్ తగ్గించాలని వస్త్ర వ్యాపారులు దుకాణాలు మూసేశారు. ఆరు నెలల నుంచి ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తూనే ఉన్నారు. చిన్నచిన్న దుకాణాల వాళ్లు కూడా షాపులు మూసి సమ్మె చేస్తున్న పరిస్థితులు ఉన్నా... వారిని పట్టించుకునే నాథుడే లేడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి... చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా తయారైంది. ఈ చిన్నచిన్న దుకాణాల వాళ్లకు మద్దతుగా నిలబడటం కోసం శుక్రవారం రోజున (నేడు) నరసరావుపేటలో ధర్నా చేయబోతున్నాం. దుకాణదారులకు మద్దతుగా ప్రజలంతా ఈ ధర్నాలో పాలుపంచుకోవాలని కోరుతున్నా. నేను కూడా మీతో పాటుగా అక్కడ ధర్నాలో పాలు పంచుకుంటాను.

మాట వదిలేస్తే బతకటమే అనవసరం..
మాటంటూ ఇస్తే ఎన్నికల వేళ ప్రజలను మోసం చేయడానికి కాదు.. కష్టమైనా.. నష్టమైనా ఇచ్చిన మాట తప్పకూడదని.. మడమ తిప్పకూడదని.. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం తెచ్చిన దివంగత వైఎస్సారే నాకు స్ఫూర్తి. ప్రజల గుండె చప్పుడు వినాలని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మండుటెండలో కాలినడకన 1500 కిలోమీటర్లు ప్రయాణించిన ఆ మహానేత అడుగుజాడల్లోనే నా పయనం. నాడు నల్లకాలువ సంతాప సభలో పాల్గొన్నప్పుడు నా మనసు నిండా బాధ ఉంది. తండ్రిని పోగొట్టుకున్న బాధ ఎలా ఉంటుందో తెలిసింది. 

దివంగత నేత కోసం ఎవరెవరు చనిపోయారో ఆ ప్రతి కుటుంబాన్నీ కలిసి పరామర్శిస్తానని అప్పుడే మాట ఇచ్చాను. అది నువ్వు ఎందుకు చెప్పావని ఎవరైనా అడిగితే.. నేను సమాధానం చెప్పలేను. దేవుడు ఆ మాట నా చేత ఎందుకు చెప్పించాడో తెలియదు. ఎలాంటి రాజకీయాలు లేని ఆ వేళ నేను కల్మషం లేని మనస్సుతో ఆ మాట చెప్పాను. నేను ఇచ్చిన ఆ మాటను గాలికి వదిలేయమన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. అలా నేను చేయలేనని చెప్పాను. కారణం ఏమిటంటే.. ఇచ్చిన మాటను వదిలేస్తే నేను బతికి ఉండటం కూడా అనవసరం అనిపించే ఆ మాట చెప్పా.

మాట తప్పనందుకే సీబీఐ విచారణ..
ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నందుకు ఇవాళ నా మీద సీబీఐ విచారణ వేశారు. ఇన్‌కంటాక్స్ కేసులు పెట్టారు. ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టరేట్‌తో నా మీద దాడులు చేయించారు. అన్నీ జరిగాయి. కానీ ఆ మాటపై నిలబడినందుకు నేను ఇవాళ కొన్ని వేల కిలోమీటర్లు తిరిగాను. 600 గుడిసెల్లోకి వెళ్లాను.. ప్రతి పేదవాడు పడుతున్న కష్టాన్ని దగ్గర నుంచి చుశాను.. ఆ మాటను గాలికి వదిలేసి ఉంటే బహుశా ఎప్పటికి కూడా నేను ఇవ న్నీ చూసి ఉండక పోయేవాణ్నేమో.
Share this article :

0 comments: